breaking news
Amit Yadav
-
ఎగుమతిదారులకు వడ్డీ రాయితీ స్కీమ్ పొడిగింపు!
న్యూఢిల్లీ: ఎగుమతిదారులకు వడ్డీ రాయితీ పథకాన్ని (ఈక్వలైజేషన్ స్కీమ్) కేంద్ర ప్రభుత్వం పొడిగించే అవకాశాలున్నాయి. ఎగుమతుల రంగానికి సంబంధించిన ఈ పథకం 2015, ఏప్రిల్లో మొదలైంది. ఎంపిక చేసిన వస్తువులకు సంబంధించిన రుణాలపై 3–5 శాతం సబ్సిడీనిచ్చే ఈ స్కీమ్ ఈ ఏడాది మార్చి 31న ముగిసింది. కరోనా వైరస్ కల్లోలంతో కుదేలైన ఎగుమతుల రంగాన్ని ఆదుకునే చర్యల్లో భాగంగా ఈ స్కీమ్ను పొడిగించే అవకాశాలున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు సూచన ప్రాయంగా వెల్లడించారు. ఫిక్కీ నిర్వహించిన వెబినార్లో విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టర్ జనరల్ అమిత్ యాదవ్ మాట్లాడారు. రానున్న వారాల్లో ఈ స్కీమ్ పొడిగింపునకు సంబంధించి శుభవార్త వింటారనిపేర్కొన్నారు -
అమ్మాయిలా చాటింగ్.. ఉన్మాదిలా కత్తిపోట్లు
భోపాల్: మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఫేస్ బుక్ లో ఒక అమ్మాయిగా పరిచయం చేసుకొని దగ్గరై నిజం తెలిసిన తర్వాత ఆ అమ్మాయి నిరాకరించడంతో ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. దారుణంగా పొడిచి హతమార్చాడు. అడ్డొచ్చిన ఆమె తల్లిపై కూడా దాడి చేశాడు. ఆ యువతి అక్కడికక్కడే చనిపోగా తల్లి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని గీతా నగర్ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమిత్ యాదవ్ అనే 24 ఏళ్ల యువకుడు ఫేస్ బుక్ లో ఓ నకిలీ ఖాతా క్రియేట్ చేసుకున్నాడు. ఆ ఖాతాలో తనను ఒక అమ్మాయిగా పరిచయం చేసుకున్నాడు. పేరు అధర్వగా పేర్కొన్నాడు. అనంతరం ప్రియా రావత్(17) అనే అమ్మాయితో అమ్మాయిగానే పరిచయం పెంచుకున్నాడు. చివరకు ప్రియాకు ఈ విషయం తెలిసి ముఖం చాటేసింది. అతడితో చాట్ చేయడం మానేసింది. దీంతో ఆ యువకుడు ఆమెను కలిసేందుకు వస్తానంటే నిరాకరించింది. దీంతో నేరుగా ఇంటికి వెళ్లిన అతడు తనతో మాట్లాడాలని బ్రతిమిలాడాడు. అయితే, తనకు అబద్ధం చెప్పి మోసం చేశావని, మాట్లాడటం, చాట్ చేయడం కుదరదని తెగేసి చెప్పింది. దీంతో ఒక్కసారిగా ఉన్మాదిలా మారి కత్తి పోట్లు పొడిచాడు. ఆమె తల్లిపై కూడా కత్తితో దాడి చేసి పారిపోయే క్రమంలో రెండో అంతస్తు నుంచి దూకి కాళ్లు విరగ్గొట్టుకుని పోలీసుల చేతికి చిక్కాడు.