-
21న వైఎస్ జగన్ జన్మదినం
మెగా రక్తదాన శిబిరం విజయవంతం చేయండి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి పిలుపు అనంతపురం రూరల్ : వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 21న పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయణ, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి హాజరై మెగా రక్తదాన శిబిరం పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యువజ విభాగంలో రాజకీయ కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలను సైతం విస్తృతంగా చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఈనెల 21న అనంతపురంలోని సిద్ధార్థ పంక్షన్ హాల్లో వెయ్యి యూనిట్లు రక్తం సేకరించడమే లక్ష్యంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, విద్యార్థి, యువజన విభాగం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకర్గం నుంచి 100 మందికి తక్కువ కాకుండా రక్తదానం చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రక్తదానం చేయాల్సిన వారు తమ నియోజకవర్గంలోని సమన్వయకర్త దగ్గర ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. రక్తదానం ఆవశ్యకతపై యువత, విద్యార్థులను చైతన్యవంతులను చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డి, మాజీ మేయర్ రాగే పరశురాం, సీనియర్ నాయకులు చవ్వా రాజశేఖర్రెడ్డి, నదీమ్ యువజన విభాగం నాయకులు శ్రీకాంత్రెడ్డి, మారుతీనాయుడు, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మిద్దె భాస్కర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకులు కొర్రపాడు హుస్సేన్ పీరా, రైతు విభాగం నాయకులు యూపీ నాగిరెడ్డి, అనీల్కుమార్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు. -
‘వెన్నపూస’ గెలుపే ధ్యేయం
ఓటు నమోదును వేగవంతం వైఎస్సార్ సీపీ యువజన నాయకుడు ఆలూరు సాంబశివారెడ్డి అనంతపురం రూరల్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాలరెడ్డిని గెలిపించడమే ధ్యేయంగా పార్టీ శ్రేణులు పని చేయాలని పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. డిసెంబర్ 8 వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదును పొడిగించిన నేపథ్యంలో యువత చురుగ్గా పాల్గొని పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. అలాగే చంద్రబాబు పాలనపై యువతను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇంటికో ఉద్యోగం.. లేదంటే నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చిన ఆయన అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతను రోడ్లపాలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ అవకాశాల కోసం యువత డిగ్రీలు చేతబట్టుకుని ఇతర రాష్ట్రాలకు పరుగులు తీయాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, ప్రతి జిల్లా ఒక హైదరాబాద్లా మారి ఉండేదని అన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికీ ప్రత్యేకహోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పాపాన పోలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీతో ఉద్యోగాలు రావని, కేవలం అ«ధికార పార్టీ నాయకుల జేబులు మాత్రమే నిండుతాయని చెప్పారు. అమరావతికెళ్లి అనంతపురంలో కరువును జయించామని, ఇక్కడికొచ్చి పట్టిసీమతో రాయలసీమను సస్యశామలం చేస్తుంటే ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తోందని ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేవలం యువతనే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకుడు ఆకుల రాఘవేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement