breaking news
Advanced JEE
-
28 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తులు
హైదరాబాద్: దేశంలోని ఐఐటీల్లో 2017-18 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు శుక్రవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గురువారం జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో అడ్వాన్స్డ్ పరీక్ష ప్రక్రియను మద్రాస్ ఐఐటీ చేపట్టింది. మే 21న ఈ పరీక్ష జరుగనుంది. జేఈఈ మెయిన్ పరీక్షలకు దాదాపు 11 లక్షల మంది హాజరైన విషయం తెలిసిందే. అందులో అర్హత సాధించిన వారిలో టాప్ 2.2 లక్షల మందిని అడ్వాన్స్డ్కు అనుమతిస్తారు. మే 2 వరకు దరఖాస్తులు.. ఏప్రిల్ 28వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మే 2వ తేదీ వరకు జేఈఈ అడ్వాన్స్డ్కు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మద్రాస్ ఐఐటీ వెల్లడించింది. రిజిస్ట్రేషన్, సీట్లు, ఫీజు తదితర వివరాలను సంబంధిత ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో పొందవచ్చని పేర్కొంది. 2015 జేఈఈ మెయిన్లో టాప్ 1.5 లక్షల మందిని అడ్వాన్స్డ్కు అనుమతించగా.. 2016లో టాప్ 2 లక్షల మందికి అవకాశమిచ్చామని తెలిపింది. సీట్లు మిగిలిపోకుండా ఉండేందుకు ఈసారి టాప్ 2.2 లక్షల మందిని అడ్వాన్స్డ్కు అనుమతిస్తామని వివరించింది. రిజర్వేషన్ కేటగిరీల వారీగా చూస్తే... అడ్వాన్స్డ్కు ఓపెన్ కేటగిరీలో 1,11,100 మంది (50.5 శాతం), ఓబీసీలో 59,400 మంది (27 శాతం), ఎస్సీల్లో 33 వేల మంది (15 శాతం), ఎస్టీల్లో 16,500 మందిని (7.5 శాతం) అనుమతిస్తామని వివరించింది. ఇవీ మరిన్ని అర్హత వివరాలు – విద్యార్థులు 1992 అక్టోబరు 1న లేదా ఆ తరువాత జన్మించిన వారు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. అంటే 1987 అక్టోబరు 1న, లేదా ఆ తరువాత జన్మించిన వారు అర్హులే. – జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ఒక అభ్యర్థి మూడుసార్లు హాజరు కావచ్చు. అయితే వరుసగా రెండుసార్లు మాత్రమే హాజరు కావచ్చు. 2016 జేఈఈ అడ్వాన్స్డ్కు హాజరైన వారు ఈ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయవచ్చు. – ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు 2016 రాసిన వారు, 2017లో రాయబోయే వారు జేఈఈ అడ్వాన్స్డ్కు హాజరుకావచ్చు. 2014–15 విద్యా సంవత్సరానికి సంబంధించి 2015 జూన్ తరువాత ఫలితాలు వచ్చిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ రాయవచ్చు. – ఇప్పటికే ఐఐటీల్లో చేరిన వారు, గతంలో ఐఐటీల్లో సీట్లు పొంది, కాలేజీల్లో రిపోర్టింగ్ చేసి, సీటును రద్దు చేసుకున్న వారు ఈ పరీక్ష రాసేందుకు అనర్హులు. – అయితే 2016జేఈఈ అడ్వాన్స్డ్లో సీటు లభించాక సీటు యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించి, సీటును యాక్సెప్ట్ చేయని వారు (జాయింట్ సీట్ అలొకేషన్లో భాగంగా రిపోర్టింగ్ కేంద్రాల్లో ఎక్కడా రిపోర్టు చేయని వారు) ఈ పరీక్ష రాసేందుకు అర్హులే. – ఏదేని ఐఐటీల్లో 2016లో మొదటిసారిగా ప్రిపరేటరీ కోర్సులో చేరిన వారు 2017 జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరుకావచ్చు. ఇదీ పూర్తిస్థాయి జేఈఈ అడ్వాన్స్డ్ షెడ్యూలు.. జేఈఈ అడ్వాన్స్డ్కు రిజిస్ట్రేషన్: 28–4–2017(ఉదయం 10 గంటల నుంచి) 2–5–2017 (సాయంత్రం 5 గంటలవరకు) ఆలస్య రుసుముతో: 2–5–2017 నుంచి 4–5–2017 (2వ తేదీ సాయంత్రం 5 గంటల తరువాత నుంచి 4వ తేదీ సాయంత్రం 5 గంటలవ వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం) హాల్ టికెట్ల డౌన్లోడ్: 10–5–2017 నుంచి 21–5–2017 జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష: 21–5–2017: (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపరు–2 పరీక్ష ఉంటుంది). ఆన్లైన్లో ఓఎంఆర్ జవాబు పత్రాల ప్రదర్శన. వాటిపై అభ్యర్థుల నుంచి విజ్ఞప్తుల స్వీకరణ: 31–5–2017 ఉదయం 10 గంటల నుంచి 3–6–2017 సాయంత్రం 5 గంటల వరకు జవాబుల కీలు: 4–6–2017: ఉదయం 10 గంటలకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. జవాబుల కీలపై విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరణ:4–6–2017 నుంచి 6–6–2017 వరకు అడ్వాన్స్డ్ ఫలితాలు వెల్లడి: 11–6–2017 ఉదయం 10 గంటలకు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టుకు (ఏఏటీ) ఆన్లైన్ రిజిస్ట్రేషన్: 11–6–2017 ఉదయం నుంచి 12–6–2017 సాయంత్రం వరకు ఏఏటీ పరీక్ష:14–6–2017: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏఏటీ ఫలితాలు విడుదల: 18–6–2017 ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీల్లో సంయుక్త ప్రవేశాలు: 19–6–2017 నుంచి 18–7–2017 ============= జేఈఈ అడ్వాన్స్డ్కు అనుమతించే విద్యార్థుల వివరాలు... కేటగిరీ అభ్యర్థుల సంఖ్య ఓపెన్ 1,07,767 ఓపెన్ – వికలాంగులు 3,333 ఓబీసీ నాన్ క్రీమీలేయర్ 57,618 ఓబీసీ–ఎన్సీఎల్–వికలాంగులు 1,782 ఎస్సీ 32,010 ఎస్సీ–వికలాంగులు 990 ఎస్టీ 16,005 ఎస్టీ–వికలాంగులు 495 ---------------------------------------------------- మొత్తం 2,20,000 -
జేఈఈ అడ్వాన్సడ్ సందేహాలు-సమాధానాలు
జేఈఈ అడ్వాన్స్డ్.. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో చేరాలని కోరుకునే ంజనీరింగ్ ఔత్సాహిక విద్యార్థులకు సుపరిచితమైన పరీక్ష. జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష కోసం ఇంటర్మీడియెట్ తొలి సంవత్సరం తొలి రోజు నుంచే కృషి చేస్తారనడం నిస్సందేహం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రతిభావంతులు పోటీపడే ప్రతిష్టాత్మక పరీక్ష ఇది. ఇదే సమయంలో పరీక్ష శైలి నుంచి ప్రవేశాల వరకూ ఎన్నో సందేహాలు కూడా! జేఈఈ-అడ్వాన్స్డ్-2016 తేదీ ఖరారైన నేపథ్యంలో విద్యార్థుల సందేహాలకు నిపుణుల సమాధానాలు.. ప్ర:జేఈఈ అడ్వాన్స్డ్-2016 ఎప్పుడు జరగనుంది? జ:మే 22, 2016న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఐఐటీ కమిటీ నిర్వహిస్తుంది. ఈసారి నిర్వహణ బాధ్యతలను ఐఐటీ-గువహటి చేపట్టనుంది. ప్ర:జేఈఈ అడ్వాన్స్డ్ అర్హత ఏంటి; పరీక్షకు ఎన్నిసార్లు హాజరు కావచ్చు? జ:కచ్చితంగా ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా పూర్తి చేసిన విద్యార్థులే అర్హులు. 2015, 2016లో 10+2/తత్సమానంలో అన్ని సబ్జెక్టులకు హాజరై ఉండాలి. గరిష్టంగా రెండుసార్లు అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యే అవకాశముంది. మొదటి సంవత్సరం చదువుతూ ప్రాక్టీస్ లేదా అనుభవం కోసం పరీక్షకు హాజరయ్యే అవకాశం లేదు. ప్ర:గరిష్ట వయోపరిమితి ఎంత? జ:జనరల్, ఓబీసీ-ఎన్సీఎల్ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించి 1991 అక్టోబర్ 1వ తేదీ తర్వాత పుట్టిన విద్యార్థులే అర్హులు. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ అభ్యర్థులకు సంబంధించి 1986 అక్టోబర్1న జన్మించి ఉండాలి. ప్ర:జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపిక ఎలా ఉంటుంది? జ:అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరు కావాలంటే ముందుగా జేఈఈ-మెయిన్లో ఉత్తీర్ణత సాధించాలి. జేఈఈ-మెయిన్లో ఉత్తీర్ణులైన రెండు లక్షల మందిని జేఈఈ-అడ్వాన్స్డ్కు ఎంపిక చేస్తారు. అడ్వాన్స్డ్-2015 విషయంలో జేఈఈ-మెయిన్లో ఉత్తీర్ణత సాధించిన 1.5 లక్షల మందిని మాత్రమే అడ్వాన్స్డ్కు అనుమతించారు. అయితే తాజాగా నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు 2016 నుంచి జేఈఈ-మెయిన్ నుంచి 2 లక్షల మందికి అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వనున్నారు! ప్ర:జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా ప్రవేశాల ప్రక్రియ ఎలా ఉంటుంది? జ:జేఈఈ అడ్వాన్స్డ్లో ఉత్తీర్ణత ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశ ప్రక్రియ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి నిర్దిష్ట అర్హత నిబంధనలు ఉన్నాయి. అవి.. ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సులో 75 శాతం మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ విద్యార్థులు 70శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. (లేదా) బోర్డ పరీక్షలో టాప్- 20 పర్సంటైల్లో నిలవాలి. ప్ర:అడ్వాన్స్డ్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేసే సీట్లు, ఇన్స్టిట్యూట్లు ఏవి? జ:మొత్తం 17 ఐఐటీలు; ఐఎస్ఎం-ధన్బాద్, ఐఐటీ-బీహెచ్యూల్లో ప్రవేశానికి అడ్వాన్స్డ్ ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటారు. వీటిలో బీటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, బీటెక్+ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్లు మొత్తం కలిపి 2015లో 10,006 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2016లో మరో రెండు కొత్త ఐఐటీల్లో (గోవా, ఛత్తీస్గఢ్) 180 సీట్లు అదనంగా రానున్నాయి. ప్ర:కౌన్సెలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది? జ:జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకు ద్వారా ప్రవేశాలు కల్పించే ఐఐటీలు, జేఈఈ మెయిన్ ర్యాంకు ద్వారా అవకాశం లభించే ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశానికి 2015 నుంచి జాయింట్ సీట్ అలొకేషన్ (జోసా) పేరిట ఉమ్మడి ఆన్లైన్ కౌన్సెలింగ్ విధానం అమల్లోకి తెచ్చారు. అడ్వాన్స్డ్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా నిర్దేశిత వెబ్సైట్లో తమ బ్రాంచ్, ఇన్స్టిట్యూట్ల ప్రాథమ్యాలను పేర్కొనాల్సి ఉంటుంది. మొత్తం మూడు రౌండ్లలో సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీటు పొందిన అభ్యర్థులు నిర్దేశిత తేదీలోపు సదరు ఇన్స్టిట్యూట్లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వకపోతే సీటు రద్దవుతుంది. అడ్వాన్స్డ్ పరీక్ష తీరు తెన్నులు? జ:అడ్వాన్స్డ్ పరీక్ష రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) గా ఆబ్జెక్టివ్ విధానంలో మే 22, 2016న ఉంటుంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. అయితే మార్కులు, ప్రశ్నల సంఖ్య పరంగా ఏటా మార్పులు జరుగుతుంటాయి. నిర్దిష్ట మార్కింగ్ విధానం లేదు. 2015లో పేపర్-1లో 60 ప్రశ్నలు (మార్కులు 264); పేపర్- 2లో 60 ప్రశ్నలు (మార్కులు 264) అడిగారు. నెగెటివ్ మార్కింగ్ విషయంలోనూ నిర్దిష్ట విధానం ఉండదు. కొన్ని ప్రశ్నలకు 4 మార్కులు; మరికొన్ని ప్రశ్నలకు 1 మార్కు చొప్పున నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్ర:సబ్జెక్ట్వైజ్గా ఏ అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది? ప్రిపరేషన్లో ఏ అంశాలకు ఎక్కువ సమయం కేటాయిస్తే మంచి మార్కులు పొందొచ్చు? జ:అడ్వాన్స్డ్ పరీక్షలో సబ్జెక్ట్ వారీగా ప్రాధాన్య, అప్రాధాన్య అంశాలనే తేడా ఉండదు. ఒక సబ్జెక్ట్లో అన్ని అంశాల్లో నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ప్రిపరేషన్ పరంగా నిర్దిష్ట చాప్టర్లకు ఎక్కువ సమయం కేటాయించాలనుకునే దృక్పథం సరికాదు. ప్ర:ప్రిపరేషన్పరంగా సబ్జెక్ట్ అంశాల్లో నైపుణ్యం పొందడమెలా? జ:ప్రతి సబ్జెక్ట్లోనూ ఆయా టాపిక్స్ను అప్లికేషన్ ఓరియెంటేషన్తో చదవాలి. బేసిక్ కాన్సెప్ట్స్పై అవగాహన పెంచుకుంటూ ప్రిపరేషన్ సాగించడం వల్ల పరీక్షలో ప్రశ్నను ఏ తరహాలో అడిగినా సమాధానం ఇచ్చే సామర్థ్యం లభిస్తుంది. ప్ర:సబ్జెక్ట్ వారీగా ఏ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి? జ:మ్యాథమెటిక్స్లో అల్జీబ్రా, కాలిక్యులస్, 3-డి, కోఆర్డినేట్ జామెట్రీ, వెక్టార్ అల్జీబ్రాల్లో పట్టు సాధించాలి. ఫిజిక్స్లో మెకానిక్స్, థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, హీట్ అండ్ వేవ్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిజం టాపిక్స్ను ప్రత్యేక శ్రద్ధతో ప్రిపేర్ అవ్వాలి. కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీకి ప్రాధాన్యం ఇవ్వడం మేలు. అదే విధంగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేమ్డ్ రియాక్షన్స్, కెమికల్ కెనైటిక్స్, కెమికల్ బాండింగ్ టాపిక్స్పై పట్టుసాధించాలి. ప్ర:రివిజన్ టిప్స్ ఏవి? జ:ముఖ్యమైన అంశాలను, సూత్రాలను ఒక నోట్స్ రూపంలో రాసుకుంటే రివిజన్ వేగంగా పూర్తి చేసుకోవచ్చు. ఈక్వేషన్స్, టేబుల్స్, డయాగ్రమ్స్, పాయింటర్స్ వంటి పద్ధతుల్లో షార్ట్ నోట్స్ రూపొందించుకుంటే రివిజన్ వేగంగా, సులభంగా ఉంటుంది. ప్ర:కనీస అర్హత మార్కుల వివరాలు తెలపండి? జ:జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల జాబితాలో నిలవాలంటే నిబంధనల ప్రకారం అభ్యర్థులు పొందాల్సిన కనీస మార్కుల శాతాన్ని ఐఐటీ గువహటి ప్రకటించింది. వివరాలు. ర్యాంకు జాబితా కనీస మార్కుల శాతం సబ్జెక్ట్ మొత్తం కామన్ మెరిట్ లిస్ట్ 10 35 ఓబీసీ 9 31.5 ఎస్సీ 5 17.5 ఎస్టీ 5 17.5 ప్ర:ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉద్దేశం ఏమిటి? జ:ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ను ఐఐటీ ఖరగ్పూర్, రూర్కీల్లో అందుబాటులో ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అడ్వాన్స్డ్లో ర్యాంకు పొందిన విద్యార్థులకు మాత్రమే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రాసేందుకు అర్హత. అందులో మెరిట్ ఆధారంగా ఖరగ్పూర్, రూర్కీల్లో బీఆర్క్లో ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. ఈ పరీక్షకు హాజరు కావాలనుకుంటే అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాక ఆన్లైన్ విధానంలో ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్ష మూడు గంటల వ్యవధిలో ఉంటుంది. ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్, జామెట్రికల్ డ్రాయింగ్, 3-డి పర్సెప్షన్, ఇమాజినేషన్ అండ్ ఈస్థటిక్ సెన్సిటివిటీ, ఆర్కిటెక్చరల్ అవేర్నెస్ అంశాల్లో పరీక్ష ఉంటుంది. ప్ర:సీట్ల కేటాయింపులో రిజర్వేషన్ల విధానం ఎలా ఉంటుంది? జ:ఓబీసీ నాన్-క్రీమీలేయర్ వర్గాలకు 27 శాతం; ఎస్సీలకు 15 శాతం; ఎస్టీలకు 7.5 శాతం సీట్లు ప్రతి కోర్సులో కేటాయిస్తారు. మిగతా సీట్లను జనరల్ కేటగిరీలో భర్తీ చేస్తారు. అదే విధంగా ప్రతి కేటగిరీకి కేటాయించిన రిజర్వేషన్ శాతంలో మూడు శాతం సీట్లను ఆ కేటగిరీలోని వికలాంగులకు కేటాయిస్తారు. ఓబీసీ-నాన్ క్రీమీలేయర్ కోటాలో సీట్లు మిగిలితే వాటిని జనరల్ కేటగిరీకి బదిలీ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో మాత్రం మిగులు సీట్లను ఆ వర్గాలకు చెందిన విద్యార్థులకే కేటాయిస్తారు. ప్ర:ఐఐటీల్లో ఫీజులు ఎలా ఉంటాయి? జ:అన్ని ఐఐటీల్లో ట్యూషన్ ఫీజు మాత్రం ఒకే విధంగా ఉంటుంది. ఏడాదికి రూ. 90 వేలు చెల్లించాలి. లైబ్రరీ ఫీజు, లేబొరేటరీ ఫీజు, కాషన్ డిపాజిట్ వంటి ఫీజులకు సంబంధించిన మొత్తాలు ప్రతి ఐఐటీకి వేర్వేరుగా ఉంటాయి. ఫీజులను సెమిస్టర్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజుతో కలిపి ఏడాదికి దాదాపు రూ.1.25 లక్షల నుంచి రూ. 1.30 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ విద్యార్థులకు హాస్టల్ ఫీజు నుంచి పూర్తి రాయితీ. ట్యూషన్ ఫీజులను 2.5 లక్షలకు పెంచాలని ఐఐటీ నిపుణుల కమిటీ చేసిన సిఫార్సును ప్రభుత్వం ప్రస్తుతం వాయిదా వేసింది. ప్ర:రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఎంత ఉంటుంది? జ:ప్రస్తుతం అమలవుతున్న విధానాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ట్యూషన్ఫీజు, హాస్టల్ ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు లభిస్తుంది. అదే విధంగా కుటుంబ వార్షికాదాయం రూ. 4.5 లక్షల్లోపు ఉన్న అన్ని కేటగిరీల విద్యార్థులకు వంద శాతం మినహాయింపు లభిస్తుంది. ప్ర:ఐఐటీ సీట్లలో స్థానిక కోటా రిజర్వేషన్లు ఏమైనా ఉంటాయా? జ:ఐఐటీల్లో హోంస్టేట్ కోటా విధానం అమల్లో లేదు. జాతీయ స్థాయిలో పొందిన మెరిట్ ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో మాత్రం 50 శాతం సీట్లను హోంస్టేట్ కోటా కింద సదరు ఇన్స్టిట్యూట్ ఉన్న రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ విద్యార్థులకు నిట్-వరంగల్లో, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు నిట్-తాడేపల్లిగూడెంలో 50 శాతం సీట్ల చొప్పున లభిస్తాయి. జేఈఈ అడ్వాన్స్డ్-2016 సమాచారం, ముఖ్య తేదీలు జేఈఈ మెయిన్-2016లో మొదటి రెండు లక్షల మందిలో ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: ఏప్రిల్ 29, 2016 నుంచి మే 4, 2016 వరకు హాల్ టికెట్ డౌన్లోడ్: మే 11, 2016 నుంచి మే 22, 2016 వరకు పరీక్ష తేదీ: మే 22, 2016 (పేపర్-1 ఉదయం 9 నుంచి 12 గంటల వరకు; పేపర్-2 మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు) ఫలితాల వెల్లడి: జూన్ 12, 2016 ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రిజిస్ట్రేషన్:జూన్ 12, 13 సీట్ల కేటాయింపు: జూన్ 20, 2016 నుంచి జూలై 19, 2016 వరకు వివరాలకు వెబ్సైట్: http://www.jeeadv.ac.in వ్యూహం పకడ్బందీగా ఉండాలి జాతీయ స్థాయిలో ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి ఒకే ఎంట్రన్స్ నిర్వహించాలనే అంశంపై చర్చ జరిగినా 2016 ప్రవేశాలకు సంబంధించి గత విధానమే అమలు కానుంది. కాబట్టి విద్యార్థులు కూడా తమ వ్యూహాలకు పదును పెట్టాలి. మెయిన్ నుంచి అడ్వాన్స్డ్కు ఎంపిక చేసే విద్యార్థుల సంఖ్యను 1.5 లక్షల నుంచి 2 లక్షలకు పెంచడం హర్షణీయం. ఇదే క్రమంలో పోటీ కూడా పెరుగుతుందనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. అడ్వాన్స్డ్లో 55 నుంచి 60 శాతం మార్కులు పొందే విధంగా కృషి చేస్తే ఐఐటీల్లో సీటు సొంతం చేసుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. గతంలో 45 నుంచి 50 శాతం మధ్యలో మార్కులకు సీటు వచ్చిన సందర్భాలున్నా ఇప్పుడు అడ్వాన్స్డ్కు రెండు లక్షల మందిని ఎంపిక చేసే విధానం కారణంగా పోటీ పెరుగుతుంది. అభ్యర్థులు కాన్సెప్ట్యువల్ క్లారిటీ, అప్లికేషన్ ఓరియెంటేషన్తో ప్రిపరేషన్ సాగిస్తే విజయం సొంతం చేసుకోవచ్చు. - ఆంటోని, జేఈఈ కోర్స్ డెరైక్టర్, టైమ్ ఇన్స్టిట్యూట్ -
జేఈఈ అడ్వాన్సడ్ - 2015
జేఈఈ అడ్వాన్స్డ్.. లక్షా యాభై వేల మంది ప్రతిభావంతులు మాత్రమే హాజరయ్యే పరీక్ష. ఇందుకోసం విద్యార్థులు జేఈఈ-మెయిన్లోని పేపర్-1 పరీక్ష రాయాలి. జేఈఈ-మెయిన్ ద్వారా 1,50,000 మంది విద్యార్థులకు అడ్వాన్స్డ్కు అర్హత కల్పిస్తారు. వీరిలో 20,000 మంది విద్యార్థులకు ర్యాంక్ కేటాయిస్తారు. అడ్వాన్స్డ్ ర్యాంక్తోపాటు ఇంటర్లో టాప్ 20 పర్సంటైల్ లేదా 75 శాతం మార్కులు ఉంటేనే ఐఐటీలు, ఐఎస్ఎంలో ప్రవేశం లభిస్తుంది. ఆబ్జెక్టివ్గా రెండు పేపర్లు జేఈఈ అడ్వాన్స్డ్లో రెండు ఆబ్జెక్టివ్ పేపర్లు.. పేపర్-1, పేపర్-2 ఉంటాయి. ప్రతి పేపర్కు 180 మార్కుల చొప్పున మొత్తం కేటాయించిన మార్కులు 360. వీటిలో నాలుగు రకాల ప్రశ్నలిస్తారు. ప్రతి పేపర్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి పేపర్కు సమయం మూడు గంటలు. తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కులిస్తారు. అంతేకాకుండా హాజరు విషయంలో కూడా పరిమితి విధించారు. ఈ క్రమంలో జేఈఈ-అడ్వాన్స్డ్కు వరుసగా రెండు సార్లు (సంవత్సరాలు) మాత్రమే రాసే అవకాశం ఉంది. మ్యాథమెటిక్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాలు: లిమిట్స్ అండ్ కంటిన్యుటీ, డిఫరెన్షిబిలిటీ, 3డీ లైన్స్-ప్లేన్స్ (అనుబంధ ప్రశ్నలు), క్వాడ్రాటిక్ ఈక్వేషన్స, మ్యాట్రిక్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్, ఏరియా బౌండెడ్ బై కర్వ్స్, మాక్సిమ-మినిమ, జామెట్రికల్ అప్లికేషన్స్, కాంప్లెక్స్ నంబర్స్, అప్లికేషన్స్ ఆఫ్ వెక్టర్ అల్జీబ్రా, డిఫరెన్షియల్ ఇంటిగ్రేషన్.పిపరేషన్ కోసం 4-5 పుస్తకాలను రిఫర్ చేయడం కంటే ఏదో ఒక ప్రామాణిక పుస్తకాన్ని సంపూర్ణంగా చదవడమే ఉత్తమం. బీఆర్క్ కోసం ఏఏటీ బీఆర్క్ (ఆర్కిటెక్చర్)లో చేరాలనుకునే విద్యార్థులు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ)కు హాజరు కావాలి. జేఈఈ-అడ్వాన్స్డ్లో ర్యాంక్ సాధించిన విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు. ఇందుకోసం 2015, జూన్ 18-19 మధ్య రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పరీక్షను 2015, జూన్ 21న నిర్వహిస్తారు. ఫిజిక్స్ ఫిజిక్స్లో కొన్ని అంశాలు ఉమ్మడిగా ఉంటాయి. వాటిని ఒకే సారి చదవడం ప్రయోజనకరం. ఉదాహరణకు గ్రావిటేషన్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, మాగ్నో స్టాటిస్టిక్స్; కరెంట్ ఎలక్ట్రిసిటీ, హీట్ ట్రాన్స్ఫర్, ఫ్లూయిడ్ డైనమిక్స్; సౌండ్ వేవ్స్, వేవ్ ఆప్టిక్స్, సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్, సింపుల్ హార్మోనిక్ మోషన్; లీనియర్ డైనమిక్స్, రొటేషనల్ డైనమిక్స్; థర్మోడైనమిక్స్, కెమిస్ట్రీలోని థర్మోడైనమిక్స్ భాగం. థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్. ఆప్టిక్స్లో.. ముందుగా వేవ్ టాపిక్స్ను పూర్తి చేయడం మంచిది. తర్వాత జామెట్రికల్ ఆప్టిక్స్ను ప్రిపేర్ కావాలి. వేవ్స్లో ట్రాన్స్వర్స్ వేవ్స్, సౌండ్ వేవ్స్కు వెయిటేజీ సమంగా ఉంటుంది. సింపుల్ హార్మోనిక్ మోషన్, ఫిజికల్ ఆప్టిక్స్, ఆసిలేషన్స్, ఏసీ సర్క్యూట్స్లలోని మ్యాథమెటికల్ పార్ట్ ప్రిపేర్ కావడం ఉపయుక్తం. గ్రావిటేషన్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, మాగ్నటిజంలలో కూడా టాపిక్స్ కామన్. ప్రిన్సిపల్స్, అప్లికేషన్స్లో కొద్దిపాటి తేడా ఉంటుంది. కూలుంబ్స్ లా.. న్యూటన్స్ గ్రావిటేషన్ లాగా మారుతుంది. గాస్ లాను గ్రావిటేషన్ ఫీల్డ్ ఎవల్యూషన్లోనూ ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, మాగ్నటిజం అంశాలను ఒక్కటిగా చదువుకోవచ్చు. కెమిస్ట్రీ గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ఇనార్గానిక్ కెమిస్ట్రీకి అధిక ప్రాధాన్యతనిచ్చారు. కాబట్టి మెటలర్జీ, కాంప్లెక్స్ కంపౌండ్స్, అనలిటికల్ కెమిస్ట్రీ, పి-బ్లాక్ ఎలిమెంట్స్, డి-బ్లాక్ ఎలిమెంట్స్పై ఎక్కువగా దృష్టి సారించాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో అడిగే ప్రశ్నలు ఆయా అంశాల్లోని ప్రాథమిక భావనలను పరీక్షించే విధంగా ఉంటాయి. ఉదాహరణకు ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్స్, రియాక్షన్ మెకానిజం, రీజెంట్స్, స్టెబిలిటీ ఆఫ్ ఇంటర్మీడియెట్స్. ఈ అంశానికి సంబంధించి ఇచ్చిన సిలబస్ వరకే పరిమితం కావడం మంచిది. ఫిజికల్ కెమిస్ట్రీలో మోల్ కాన్సెప్ట్, ఈక్విలెంట్ కాన్సెప్ట్స్, సాల్యుబులిటీ ప్రొడక్ట్, కామన్ ఆయాన్ ఎఫెక్ట్, ఎలక్ట్డ్ ్రపొటెన్షియల్ వంటి అంశాలపై దృష్టి సారించాలి. ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే ప్రాథమిక భావనలపై పట్టు, ఇచ్చిన సమస్య ప్రకారం సూత్రాన్ని అన్వయించుకునే సామర్థ్యం వంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. షెడ్యూల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మే 2, 2015. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు: మే 7, 2015. అడ్మిట్ కార్డు డౌన్లోడింగ్: మే 9-12, 2015. పరీక్ష తేదీ: మే 24, 2015. వెబ్సైట్: http://jeeadv.iitd.ac.in