breaking news
additional sessions judge
-
ఎవరా జడ్జి.. శిక్షణ సరిగా లేదా?.. సుప్రీంకోర్టు అసహనం
సాక్షి, న్యూఢిల్లీ: బెయిలు మంజూరు చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలు సరిగా అర్థం చేసుకోలేకపోయిన జడ్జి ఎవరు? జ్యుడీషియల్ అకాడమీ శిక్షణ సరిగా లేదా? అని నెల్లూరు అదనపు సెషన్ జడ్జిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నెల్లూరు కేంద్ర కారాగారంలో గృహహింస, హత్య కేసులో దోషిగా తొమ్మిదేళ్లు శిక్ష అనుభవిస్తున్న గోపిశెట్టి హరికృష్ణ అనే వ్యక్తిని మూడు రోజుల్లో ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టాలని, బెయిలు మంజూరు చేయాలని సెప్టెంబర్ 28, 2020న సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. చదవండి: ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ 3 రోజుల్లో జైలు అధికారులు హరికృష్ణను ప్రవేశపెట్టని కారణంగా ట్రయల్ కోర్టు బెయిలు నిరాకరించింది. దీనిపై ఓ న్యాయవాది సుప్రీంకోర్టుకు లేఖ రాయడంతో ఏప్రిల్ 2022లో హరికృష్ణ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ సమయంలో జైలు అధికారులు, ట్రయల్ కోర్టు జడ్జి, సుప్రీంకోర్టు రిజిస్ట్రీలు వివరణ ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. ఈ కేసును సోమవారం జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం విచారించింది. గతంలో కోర్టు ఉత్తర్వులు తదనంతరం పరిణామాలను ధర్మాసనం ప్రస్తావించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ అయినా హరికృష్ణ కస్టడీలో కొనసాగారు. ఉత్తర్వులు ఎలక్ట్రానిక్ పద్ధతిలో పంపగా అక్టోబర్ 6న జైలు అధికారులకు అందాయని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చెబుతోంది. మరోవైపు సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వుల్ని ట్రయల్ కోర్టు సరిగా అర్థం చేసుకున్నట్టు కనిపించడం లేదు. మూడు రోజుల్లో ప్రవేశపెట్టాలంటే త్వరగా ప్రవేశపెట్టాలని అంతేకానీ తర్వాత ప్రవేశపెడితే బెయిల్ ఇవ్వకూడదని అర్థం కాదు. ఒక న్యాయాధికారి ఈ విధంగా అర్థం చేసుకోవడం ఆశ్చర్యంగా ఉంది’’అని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారమంతా హైకోర్టుకు వదిలేస్తున్నామంది. 6 వారాల్లో హైకోర్టు వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. కింది కోర్టులు నెలవారీ నివేదికలను హైకోర్టుకు ఇస్తుంటే ఇలాంటివి జరగవని ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి చెప్పారు. విచారణ సందర్భంగా ట్రయల్ కోర్టు జడ్జిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఆ జడ్జికి పదేళ్ల సర్వీసు పూర్తయిందా.. ఇలాంటి న్యాయాధికారులు ఉండటంపై క్షమించండి.. అంటూ వ్యాఖ్యానించింది. -
హైకోర్టు జడ్జి వేధింపులపై మహిళా జడ్జి ఫిర్యాదు
మహిళలు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా.. తమ పైవాళ్ల నుంచి వేధింపులు తప్పడం లేదని వాపోతున్నారు. గ్వాలియర్లో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్న ఓ మహిళ.. తనను హైకోర్టు జడ్జి లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఏకంగా ఓ ఐటెం సాంగ్కు తనను డాన్సు చేయమన్నారని ఆరోపించారు. అయితే.. తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోడానికి ఆమె తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఢిల్లీ కోర్టులలో 15 ఏళ్ల పాటు న్యాయవాదిగా పనిచేసిన తర్వాత, ఆమె మధ్యప్రదేశ్ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్ పరీక్ష రాసి, గ్వాలియర్లో 2011లో పోస్టింగ్ పొందారు. శిక్షణ తర్వాత 2012 చివర్లో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా గ్వాలియర్లో పోస్టింగ్ పొందారు. 2013లో విశాక కమిటీకి జిల్లా చైర్పర్సన్గా నియమితులయ్యారు. 2014లో ఆమె పనితీరుపై ఇచ్చిన నివేదికలో కూడా ఆమె అద్భుతంగా పనిచేస్తున్నట్లు రాశారు. కానీ.. మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి తనను ఒంటరిగా ఆయన బంగ్లాకు రమ్మన్నారంటూ ఆమె ఆరోపించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎం లోధా, న్యాయమూర్తులు జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ అనిల్ రమేష్ దవే, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో పాటు మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఆమె ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో జరిగే ఓ కార్యక్రమంలో ఐటెం సాంగ్కు డాన్స్ చేయాల్సిందిగా తనకు సందేశం పంపారని ఆమె వాపోయారు. అయితే, తన కూతురి పుట్టిన రోజు ఉందంటూ ఆమె ఆ కార్యక్రమానికి వెళ్లలేదు. దాంతో తర్వాతిరోజు న్యాయమూర్తి నుంచి తనకు మరో మెసేజ్ వచ్చిందని, అందులో.. ''ఒక సెక్సీ, అందమైన ఫిగర్ ఫ్లోర్ మీద డాన్సు చేయడాన్ని నేను మిస్సయ్యాను. అది చూడాలని చాలా కోరికగా ఉన్నాను'' అని ఉన్నట్లు ఆమె ఆరోపించారు. అయితే.. తన మాట వినకపోవడంతో న్యాయమూర్తికి ఆగ్రహం వచ్చిందని, ఎన్ని రకాలుగా పరిశీలించినా తనలో తప్పులు దొరక్కపోవడంతో ఆయన మరింత కోపం తెచ్చుకున్నారని ఆమె అన్నారు. వేధింపులు భరించలేక తాను తన భర్తతో కలిసి న్యాయమూర్తిని కలిసేందుకు వెళ్లగా, తన భర్తను చూసి ఆయనకు చాలా కోపం వచ్చిందని, 15 రోజుల తర్వాత వచ్చి కలవమన్నారని, అయితే ఈలోపే తనను బదిలీ చేశారని చెప్పారు. తన కుమార్తె సీనియర్ ఇంటర్ చదువుతోందని, మధ్యలో బదిలీ అంటే కష్టమని వేడుకున్నా పట్టించుకోలేదన్నారు. పైపెచ్చు, తనను ఎందుకు బదిలీ చేశారని అడిగితే.. కనీసం ఒక్కసారి కూడా బంగ్లాకు రానందుకు తన కెరీర్ మొత్తాన్ని నాశనం చేస్తానన్నారని, జీవితాంతం ఇందుకు బాధపడాల్సి వస్తుందన్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయం చెప్పేందుకు ప్రయత్నించగా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనను కలవడానికి నిరాకరించారన్నారు. దాంతో ఇక తాను ఏమీ చేయలేని పరిస్థితిలో జ్యుడీషియల్ సర్వీసుకు రాజీనామా చేయక తప్పలేదని ఫిర్యాదులో తెలిపారు. సహోద్యోగులు అందరినీ సోదర, సోదరీమణులుగా పిలిచే ఏకైక వృత్తి ఇదేనని, కానీ ఇక్కడ కూడా ఇలా జరగడం దురదృష్టకరమని, తన వద్దకు ఫిర్యాదు వచ్చిన తర్వాత తగిన చర్య తీసుకుంటానని ఈ ఫిర్యాదుపై జస్టిస్ లోధా అన్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)