
విశాఖ స్పోర్ట్స్: భారత మహిళల క్రికెట్ జట్టు విశాఖ చేరుకుంది. ప్రత్యేక విమానంలో కొలంబో నుంచి విశాఖ వచ్చిన మహిళల జట్టుకు విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు.

మహిళా క్రికెటర్లతో ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు.

భారత్ జట్టు ఈనెల 9న దక్షిణాఫ్రికాతోను, 12న ఆ్రస్టేలియాలతో తలపడనుంది.

టోర్నీలో భాగంగా ఐదు వన్డే మ్యాచ్లకు డా.వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

ఈ రెండు మ్యాచ్లు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్నాయి.

మహిళల ప్రపంచ కప్కు భారత్ తొలిసారిగా 1997లో కోల్కతా వేదికగా ఆతిథ్యమివ్వగా,ఇప్పుడు శ్రీలంకతో కలిసి మరోసారి నిర్వహిస్తోంది.




