మహరాజ్గంజ్: మత మార్పిడులకు పాల్పడుతున్నారని ఓ చర్చి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్న ఘటన ఉత్తరప్రదేశ్లో శనివారం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మహరాజ్గంజ్ జిల్లా దథౌలీ ప్రాంతంలో చర్చి పాస్టర్ యోహన్నన్ ఆడమ్ మతమార్పిడులకు పాల్పడుతున్నారని హిందూ యువవాహిని(హెచ్వైవీ)ఫిర్యాదు చేయడంతో పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. స్థానిక ఎస్హెచ్వో ఆనంద్ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ, దాదాపు 150 మంది స్థానికులు, 10 మంది అమెరికన్లు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని తెలిపారు. విచారణ జరిపి దోషులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
మరోవైపు పాస్టర్ యోహన్నన్ ఆడమ్ మాట్లాడుతూ, మత మార్పిడులు చేస్తున్నామన్న వాదనలు నిరాధారమనీ, తామంతా ప్రార్థనకే హాజరయ్యామని తెలిపారు. హిందూ యువవాహిని అధ్యక్షుడు సునిల్ సింఘాల్ మాట్లాడుతూ, ‘వారు(క్రైస్తవులు) తమ ప్రార్థనల్ని చర్చిల్లోనే నిర్వహించుకోవాలి. లేదా ఇంట్లో చేసుకోవాలి. అంతేకాని బహిరంగ ప్రదేశాల్లో చేసుకోవడం కుదరదు. ఒకవేళ బహిరంగ ప్రదేశాల్లోనే చేసుకుంటామంటే చర్చిలు కూడా సురక్షితంగా ఉండవ’ ని హెచ్చరించారు.
గతంలోనూ ఈ సంస్థ సభ్యులు గోరఖ్పూర్లోని ఫుల్ గాస్పెల్ చర్చిని ధ్వంసం చేశారు. చర్చిలు అమాయకులైన హిందువులకు డబ్బుల్ని ఎరగా చూపి మతమార్పిడుల్ని ప్రోత్సహిస్తున్నాయని హిందూ యువవాహిని నాయకుడు కృష్ణ నందన్ ఆరోపించారు. మరోవైపు అమెరికా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ఈ ఘటనపై స్పందిస్తూ.. తమకు అమెరికన్ పౌరుల క్షేమమే అత్యవశ్యకమని తేల్చిచెప్పారు.
చర్చిలో ప్రార్థనను అడ్డుకున్న పోలీసులు
Published Sun, Apr 9 2017 5:40 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
అప్పుడు 'నీ తండ్రి స్థాయి తెలుసా అన్నారు': దీపిందర్ గోయల్
HYD: ఏసీపీ నివాసంలో సోదాలు.. బయటపడుతున్న నోట్ల కట్టలు
శ్యామలపై తప్పుడు కథనాలు.. చట్టపరంగానే ముందుకెళ్తానన్న యాంకర్!
స్టార్క్ సూపర్ డెలివరీ.. హెడ్కు ఫ్యూజ్లు ఔట్
భారీగా పెరిగిన ఫ్లిప్కార్ట్ గ్రోసరీ బిజినెస్
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
తెలంగాణ దశాబ్దిపై కేటీఆర్ ట్వీట్..
బిగ్బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు!
Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
క్యార్వ్యాన్లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement