ఉదంపూర్ ఘటనపై హోంమంత్రి ప్రకటన | Union Home Minister Rajnath Singh to make a statement on Udhampur attack | Sakshi
Sakshi News home page

ఉదంపూర్ ఘటనపై హోంమంత్రి ప్రకటన

Aug 6 2015 10:29 AM | Updated on Sep 3 2017 6:55 AM

ఉదంపూర్లో బీఎస్ఎఫ్ కాన్వాయ్పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేయనున్నారు.

న్యూఢిల్లీ: ఉదంపూర్లో బీఎస్ఎఫ్ కాన్వాయ్పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు.

పార్లమెంటు ఉభయ సభల్లో ఈ ప్రకటన చేస్తారని, దేశ భద్రతకు సంబంధించిన అంశాలతోపాటు, భవిష్యత్తులో తీసుకోనున్న చర్యలపై కూడా ఆయన ప్రకటన చేయనున్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం ఆయన ఈ ప్రకటన చేస్తారని వెంకయ్యనాయుడు చెప్పారు. ఇదిలా ఉండగా, ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన బీఎస్ఎఫ్ జవాన్ల త్యాగం ఎప్పటికీ గుర్తుంచుకోదగినదని రాజ్ నాధ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. వారికి గౌరవ వందనం చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement