- త్వరలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్లకు పథకం విస్తరణ
- పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడి
- మున్సిపల్ కార్పొరేషన్లలో మౌలిక సదుపాయాలపై సమీక్ష
- ఉద్యోగులతో ఇళ్లల్లో పనిచేయించుకోవద్దని కమిషనర్లకు హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో అమలు చేస్తున్న తరహాలో రాష్ట్రంలోని మరో మూడు నగరాలకు రూ. 5కే భోజన పథకాన్ని విస్తరించనున్నామని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో భోజన స్టాల్స్ ఏర్పాటుకు స్థలాలు గుర్తించాలని అధికారు లను ఆదేశించారు.
రాష్ట్రంలోని అన్ని మున్సి పల్ కార్పొరేషన్లలో రహదారులు, మార్కెట్లు, మరుగుదొడ్లు, పార్కులు, బస్ బేలు, బస్ షెల్టర్లు, శ్మశాన వాటికలు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటుపై మున్సిపల్ కార్పొరే షన్ల కమిషనర్లతో కేటీఆర్ మంగళవారం ఇక్కడ సమీక్షించారు. ప్రతి కార్పొరేషన్ భవి ష్యత్తు నివేదిక తయారు చేసుకోవాలని, దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేయాలని ఆదేశిం చారు. వచ్చే ఏడాది బడ్జెట్లో మున్సిపల్ కార్పొ రేషన్లకు ప్రత్యేక నిధులు కేటాయించనున్నా మన్నారు. మేయర్లు, కార్పొరేటర్లు, ఇతర అధికారుల ఇళ్లలో కొందరు మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు వచ్చాయని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్లను హెచ్చరించారు. పురపాలికల నుంచి జీతం తీసుకునే ఉద్యోగి సంస్థ కోసమే పనిచేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు.
సీఎం ఆలోచనలకు తగ్గట్లు...
సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కేటీఆర్ సూచించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్ల విస్తరణ, ఫుట్పాత్లు ఉండాలన్నారు. ప్రజావసరాల కోసం ప్రభుత్వ సంస్థల భూమిని నోటీసులు లేకుండానే వినియోగిం చుకునేందుకు గతంలో ఇచ్చిన సర్క్యులర్ను ఉపయోగించుకుని అవసరమైన చోట బస్ బేలు నిర్మించాలని ఆదేశించారు. ఉగాదిలోగా పట్టణాలను బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా మార్చేందుకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.
హైదరాబాద్లోని మహా ప్రస్థానం శ్మశానవాటిక స్థాయిలో అన్ని పట్టణాల్లో శ్మశానాలను నిర్మించాలన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని, కూరగాయలు, మాంసం విక్రయాలకు మోడల్ మార్కెట్లు, మెకనైజ్డ్ కబేళాలు ఏర్పాటు చేయాలన్నారు. కమిషనర్లు ఉదయం 5 గంటలకే పారిశుద్ధ్య పనులను సమీక్షించాలని, పట్టణాల్లో అనధికారికంగా ఫ్లెక్సీలు, గోడలపై రాతలు రాసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్ఈడీ దీపాల ఏర్పాటును సత్వరం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, డీఎంఏ శ్రీదేవి, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ ధన్సింగ్, డీటీసీపీ ఆనంద్బాబు తదితరులు పాల్గొన్నారు.
మరో 3 నగరాల్లో రూ.5కే భోజనం
Published Wed, Feb 15 2017 3:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
RR vs SRH: చెలరేగిన నితీష్ కుమార్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
తెలంగాణకు రేవంత్రెడ్డి శనిలా పట్టాడు: హరీష్ రావు
కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
TS: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీ పొడిగింపు
బీజేపీ కుట్రలు అడ్డుకుంటాం: సీఎం రేవంత్
విండీస్ క్రికెటర్కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.... ఐదేళ్ల పాటు నిషేధం
భర్తతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయమన్న కత్రినా!
ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
తప్పక చదవండి
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement