ఆత్మహత్య లేఖ చదివి ఏడ్చాను: వరుణ్‌ | Rohit Vemula’s suicide letter made me cry: Varun Gandhi | Sakshi
Sakshi News home page

ఆత్మహత్య లేఖ చదివి ఏడ్చాను: వరుణ్‌

Feb 22 2017 8:32 AM | Updated on Jul 26 2019 5:38 PM

ఆత్మహత్య లేఖ చదివి ఏడ్చాను: వరుణ్‌ - Sakshi

ఆత్మహత్య లేఖ చదివి ఏడ్చాను: వరుణ్‌

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌ వేముల రాసిన ఆత్మహత్య లేఖ చదివి ఏడ్చేశానని బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ తెలిపారు.

ఇండోర్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌ వేముల రాసిన ఆత్మహత్య లేఖ చదివి ఏడ్చేశానని బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ తెలిపారు. ‘దళిత పరిశోధక విద్యార్థి రోహిత్‌ గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నారు. అతని లేఖ చదివి కన్నీటి పర్యంతమయ్యాను. తన పుట్టుకే ఒక పాపమని, అందుకే ఈ ఆఘాయిత్యానికి ఒడిగడుతున్నానని అతడు రాసిన వాక్యం నా హృదయాన్ని కోతపెట్టింది’ అని అన్నారు.

వరుణ్‌ మంగళవారమిక్కడ ఓ స్కూల్లో ‘నవ భారత్‌ కోసం ఆలోచనలు’ అంశంపై ప్రసంగించారు. మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్‌లో గత ఏడాది ఓ స్కూల్లో చోటుచేసుకున్న వివక్షను కూడా ఆయన ప్రస్తావించారు. ‘మధ్యాహ్న భోజనాన్ని ఓ దళిత మహిళ వండినందుకు స్కూల్లోని 75 శాతం విద్యార్థులు తినేందుకు నిరాకరించారు. మన పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాం? ఈ దేశం, ప్రపంచం ఏ దిశగా వెళ్తున్నాయి?’ అని ఆందోళన వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement