ఖాతాదారులకు శుభవార్త! | RBI May Review Cash Withdrawal Limit This Week | Sakshi
Sakshi News home page

ఖాతాదారులకు శుభవార్త!

Jan 16 2017 10:49 AM | Updated on Sep 27 2018 9:07 PM

ఖాతాదారులకు శుభవార్త! - Sakshi

ఖాతాదారులకు శుభవార్త!

డిమానిటైజేషన్ తర్వాత నగదు విత్ డ్రా పరిమితులతో ఇబ్బందులు పడ్డ ఖాతాదారులకు శుభవార్త.

న్యూఢిల్లీ: డిమానిటైజేషన్ తర్వాత నగదు విత్ డ్రా పరిమితులతో ఇబ్బందులు పడ్డ ఖాతాదారులకు శుభవార్త. త్వరలోనే విత్ డ్రా పరిమితిని పెంచేందుకు  కేంద్రం యోచిస్తోంది.  పెద్దనోట్ల రద్దు తర్వాత విధించిన నగదు విత్ డ్రా  పరిమితులను  పెంచే అవకాశం ఉందని  ఆర్బీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ వారంలో క్యాష్ విత్ డ్రాలను సమీక్షించనున్న రిజర్వు బ్యాంకు ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు  సమాచారం. 

పొదుపు ఖాతా పరిమితి దాదాపు రూ.30-35 వేలకు వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కరెంట్ ఖాతాలోని నగదు ఉపసంహరణను వారానికి రూ. 50 వేలనుంచి కూడా పెంచనున్నట్టు అంచనా. ఇప్పటివరకు పొదుపు ఖాతాల విత్ డ్రా పరిమితి  రూ. 24 వేలు  మాత్రమే.

కాగా  డిమానిజేషన్  నేపథ్యంలో  నగదు కష్టాలను   దృష్టిలో పెట్టుకున్న కేంద్రం  దశల వారీగా వివిధ వెసులు బాటులను కల్పిస్తూ వచ్చింది. ఈ  క్రమంలో ఇటీవల ఏటీఎం  ఉపసంహరణలను రోజుకు  రూ.2500 నుంచి  రూ.4,500 కు పెంచిన సంగతి తెలిసిందే. అయితే   విత్ డ్రా  లిమిట్  ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తారా లేదా  అనేది ఇంకా అస్పష్టమే.

Advertisement
 
Advertisement
Advertisement