ఎస్సీలకు భూ పంపిణీలో నిజామాబాద్ ఫస్ట్ | Nizamabad district first in land distribution to sc | Sakshi
Sakshi News home page

ఎస్సీలకు భూ పంపిణీలో నిజామాబాద్ ఫస్ట్

Feb 5 2016 2:01 AM | Updated on Sep 3 2017 4:57 PM

భూమిలేని దళిత రైతులకు మూడెకరాల పంపిణీ పథకం అమల్లో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని...

సాక్షి, హైదరాబాద్: భూమిలేని దళిత రైతులకు మూడెకరాల పంపిణీ పథకం అమల్లో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఎస్సీ అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ ఎంవీరెడ్డి ప్రశంసించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ చేపట్టిన వివిధ పథకాల అమలుపై జీఎం ఆనందకుమార్, అన్ని జిల్లాల ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లతో ఆయన గురువారం సమీక్షించారు. ఎంవీరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది 3,334 మందికి 10 వేల ఎకరాల భూమి పంపిణీ లక్ష్యంగా కాగా, ఇప్పటివరకు 1,407 మందికి 3,713 ఎకరాలు పంపిణీ జరిగిందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement