తొలిసారి చూసినప్పటి నుంచే ఆమెను ఎంతగానో ఇష్టపడ్డాడు. ఆమె మనసు దోచుకోవాలని అనుకున్నాడు. అందుకోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు.. చివరకు కిడ్నాప్ చేశాడు! అందుకోసం ఏకంగా 150 సార్లు రెక్కీ చేయడమే కాదు.. రెండు ఆటోలు కూడా కొన్నాడు. ఇదీ ఘజియాబాద్లో కిడ్నాపైన స్నాప్డీల్ ఉద్యోగిని దీప్తి సర్నా వెనుక జరిగిన కథ. అప్పటికే పెళ్లయిన దేవేందర్ (29) పాత నేరస్తుడు. అతడి మీద మూడు హత్యకేసులు కూడా ఉన్నాయి. తొలుత ఆమె బోయ్ఫ్రెండు తమను కిరాయికి మాట్లాడుకున్నాడని, కొంత డబ్బు తీసుకుని ఆమెను వదిలించుకోవాలనుకున్నాడని దీప్తితో దేవేందర్ చెప్పాడు. తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారణ మొదలుపెడితే అసలు విషయం బయటకు వచ్చింది. కిడ్నాపర్ల గ్యాంగు నుంచి తాను విడిపోయి.. ఆమెను విడిచిపెట్టానని, ఆమె మనసు గెలుచుకున్నానని చెబుతున్నాడు.
తొలిసారి దీప్తిని 2015 జనవరిలో రాజీవ్ చౌక్ మెట్రోస్టేషన్లో చూశాడు. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. అప్పటినుంచి ఆమె వెనకాలే తిరిగి.. ఎక్కడ ఉంటోంది, ఏం పని చేస్తోంది.. అన్నీ తెలుసుకున్నాడు. ఆమె ఎక్కడికెళ్లినా వెనకాలే ఉండేవాడు. అలా మాల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు.. అన్నింటికీ వెళ్లాడు. తన మీద చాలా కేసులు ఉన్నాయని, ఇప్పుడు ప్రేమ కేసు ఎందుకు ఉండకూడదని పోలీసులను ప్రశ్నించాడంటే అతడి పిచ్చి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అతగాడి మీద ఇప్పటికే మూడు హత్యకేసులు సహా మొత్తం 32 పాత కేసులున్నాయి.
దీప్తి కిడ్నాప్ కేసులో దేవేందర్తో పాటు ప్రదీప్, ఫహీమ్, మోహిత్, మాజిద్ అనే నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. దీప్తిని కిడ్నాప్ చేస్తే ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున వస్తాయని వాళ్లకు చెప్పాడు. ఇదంతా హవాలా మార్గంలో వస్తుందని చెప్పడంతో.. వాళ్లు కూడా చాలా సులభంగా డబ్బు సంపాదించొచ్చని భావించారు. ఫిబ్రవరి 10వ తేదీన కిడ్నాప్ చేయాలని, నవంబర్ నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దేవేందర్ రెండు కొత్త సీఎన్జీ ఆటోలు కొని.. వాటిని వైశాలి మెట్రో ప్రాంతంలో తిప్పడం మొదలుపెట్టాడు. దీప్తి ప్రతిరోజూ అక్కడి నుంచి ఘజియాబాద్ పాత బస్టాండు వద్దకు ఆటోలో వెళ్తుంది. అక్కడి నుంచి ఆమె తండ్రి కవినగర్లో ఇంటికి తీసుకెళ్తారు. ఇవన్నీ తెలుసుకునే అతడు కిడ్నాప్ ప్లాన్ వేశాడు.
మనసు పడి.. 150 రెక్కీలు చేసి.. కిడ్నాప్!
Published Tue, Feb 16 2016 2:44 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసిన కన్నప్ప టీం!
జూన్ 4 తర్వాత 'గూగుల్ పే' బంద్.. ఎక్కడంటే?
TS Cabinet Meet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
రతన్టాటా.. అణువణువూ ఆదర్శమే..!
తెలుగులో ఫస్ట్ మూవీనే సూపర్ హిట్.. కానీ ఆ తర్వాతే.. ఈమెని గుర్తుపట్టారా?
ఎన్నికలు vs ఏఐ
ఇన్సూరెన్స్ సేవల్లోకి ప్రముఖ సంస్థ
ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్లో రేపు సంతాపదినం
ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్..
హోండా 0 సిరీస్ ఎలక్ట్రిక్ కార్లు.. 500 కిమీ టార్గెట్!
తప్పక చదవండి
- ఎన్నికలు vs ఏఐ
- ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్లో రేపు సంతాపదినం
- చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్వేర్ ఫ్యాషన్ షో!
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement