* పంద్రాగస్టు నేపథ్యంలో పోలీసుల అప్రమత్తత
* ఐఎస్ఐఎస్ కదలికలపై కేంద్ర హెచ్చరికలు
* ఉగ్రవాద కార్యకలాపాలపై పోలీసుల డేగ కన్ను
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్ర పురావస్తుశాఖ పరిధిలో ఉన్న గోల్కొండ కోటపై ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి లభించింది. దీంతో కోటను పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇటీవలి కాలంలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ కదలికలపై కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్రాన్ని అప్రమత్తం చేశాయి.
అలాగే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందని అమెరికా నిఘా సంస్థలు కూడా హెచ్చరించడంతో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. తెలంగాణ సహా 12 రాష్ట్రాల డీజీపీలతో శనివారం కేంద్ర హోం శాఖ ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న యువత ఎక్కువగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణలోనే ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐఎస్ఐఎస్ కదలికలు, వారి వ్యవహారశైలికి సంబంధించి కొన్ని విషయాలను రాష్ట్ర డీజీపీకి తెలియజేసినట్లు తెలిసింది. దీంతో ఆయన నిఘా వ్యవస్థను అప్రమత్తం చేశారు.
సామాజిక మాధ్యమాలపై నిఘా..
రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలు పలుమార్లు వెలుగు చూడటంతో సామాజిక మాధ్యమాలపై పోలీసులు నిఘా పెట్టారు. ముఖ్యంగా ఉగ్రవాద సంస్థలు సామాజిక మాధ్యమాల ద్వారా యువతను రెచ్చగొట్టి తమ వైపు తిప్పుకుంటున్నాయని, దీన్ని అరికట్టాలని భావిస్తున్నారు. ఐఎస్ఐఎస్లో చేరేందుకు వెళ్తూ సల్మాన్ మొహినుద్దీన్ ఈ ఏడాది జనవరి 16న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాశ్రయం, రైల్వేస్టేషన్లతో పాటు బస్స్టేషన్లపై నిఘా ఉంచారు. ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు ఎక్కువగా ఐఎస్ఐఎస్ వైపు ఆకర్షితులవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
పోలీసుల అధీనంలోకి ‘గోల్కొండ’
Published Tue, Aug 4 2015 2:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement