నలుగురు ఈవ్ టీజర్లకు రిమాండ్ | four eve teasers to remanded by harassment of girl students | Sakshi
Sakshi News home page

నలుగురు ఈవ్ టీజర్లకు రిమాండ్

Aug 19 2015 4:37 PM | Updated on Jul 11 2019 8:06 PM

విద్యార్థినుల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొత్తూరు(మహబూబ్‌నగర్): విద్యార్థినుల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం నందిగామ గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన లారీ డ్రైవర్లు రాము(24), చెన్నయ్య(22), బీటెక్ విద్యార్థులు మహేష్(22), రాకేష్(21) ఉదయం గ్రామంలోని బస్టాప్ వద్ద నిలబడి... విద్యార్థినులు, యువతులను చూసుకుంటూ తమ సెల్‌ఫోన్లలో అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.

ఈ విషయాన్ని అక్కడే ఉన్న షీ టీం సభ్యులు సుమారు అర్థగంట పాటు గమనించారు. మాటలతో ఆగకుండా వారి అగడాలు మితిమీరడంతో నలుగురినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వారిని షాద్‌నగర్ కోర్టులో హాజరుపరుచనున్నట్లు సీఐ గంగాధర్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement