ఆ రూమర్లను కొట్టిపారేసిన యాక్సిస్ బ్యాంకు | Axis Bank Dismisses Social Media Buzz About CEO Shikha Sharma's Resignation | Sakshi
Sakshi News home page

ఆ రూమర్లను కొట్టిపారేసిన యాక్సిస్ బ్యాంకు

Mar 22 2017 1:22 PM | Updated on Oct 22 2018 6:05 PM

తమ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శిఖా శర్మ రాజీనామా చేయడం లేదని యాక్సిస్ బ్యాంకు బుధవారం తేల్చి చెప్పింది.

న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు ప్రక్రియలో కొంతమంది అధికారుల అవకతవకలు యాక్సిస్ బ్యాంకు తీవ్ర ఇరకాటంలో పడేసిన సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను శాఖ దాడులతో ఆ బ్యాంకు విసుగెత్తిపోయింది. ఆ సమస్య కొంత సద్దుమణిగిందో లేదో యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖా శర్మ రాజీనామా చేస్తున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అయితే ఈ వార్తలన్ని అసత్యమని యాక్సిస్ బ్యాంకు కొట్టిపారేసింది. తమ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శిఖా శర్మ రాజీనామా చేయడం లేదని యాక్సిస్ బ్యాంకు బుధవారం తేల్చి చెప్పింది.
 
సోషల్ మీడియాలో వస్తుందంతా అబద్ధమని, ఇన్వెస్టర్లను, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ ప్రైవేట్ దిగ్గజం బీఎస్ఈకి స్పష్టంచేసింది. పెద్ద నోట్ల రద్దు కాలంలో కొన్ని శాఖల్లో నెలకొన్న అక్రమాలతో ఆదాయపు పన్ను శాఖ ఆ బ్యాంకుపై పలు దాడులు నిర్వహించింది. అంతేకాక మూడో క్వార్టర్ ఫలితాలు బ్యాంకును నిరాశపరిచాయి. మొండిబకాయిలు గుట్టలుగుట్టలుగా పెరిగిపోవడంతో బ్యాంకు నికర లాభాలు  73 శాతం పడిపోయి రూ.580 కోట్లగా నమోదయ్యాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement