'పెద్దలసభలోనూ బిల్లు పాస్ చేయిస్తాం' | Andhra Pradesh Reorganisation Bill: KCR calls on Prime Minister | Sakshi
Sakshi News home page

'పెద్దలసభలోనూ బిల్లు పాస్ చేయిస్తాం'

Feb 19 2014 7:18 PM | Updated on Aug 18 2018 4:13 PM

ప్రధానితో కేసీఆర్ (ఫైల్ ఫోటో) - Sakshi

ప్రధానితో కేసీఆర్ (ఫైల్ ఫోటో)

ప్రధాని మన్మోహన్ సింగ్తో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్ సింగ్తో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రేపు రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. విభజన బిల్లు పెద్దలసభలోనూ పాస్ చేయిస్తామని కేసీఆర్కు ప్రధాని హామీయిచ్చినట్టు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.

అయితే ఈ రోజే బిల్లు రాజ్యసభ ఆమోదం పొందుతుని భావించిన కేసీఆర్ కొద్దిగా అసహనానికి గురయినట్టు సమాచారం. బిల్లు ఆమోదం పొందుతుందన్న ఉద్దేశంతో కేసీఆర్.. రాజ్యసభకు వచ్చారు. గ్యాలరీ కూర్చుని సభా కార్యక్రమాలు వీక్షించారు. అయితే తెలంగాణ బిల్లు చర్చకు రాకుండానే రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement