అప్పులబాధతో యువరైతు ఆత్మహత్య | young farmer suicide due to debt crisis in nalgonda district | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో యువరైతు ఆత్మహత్య

Aug 12 2015 6:42 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

నల్లగొండ: అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం సింగారం గ్రామంలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన వెంకటేశం(28) తనకున్న నాలుగెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ సంవత్సరం తన భూమితో పాటు మరో ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట వేశాడు. దీని కోసం రూ. 5 ల క్షల వరకు అప్పు చేశాడు. సరైన వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తకపోవడంతో.. మనస్తాపం చెందిన వెంకటేశం ఈరోజు పొలం దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.


విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి భార్యా ఇద్దరు పిల్లలున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement