పోకిరీల వేధింపులతో మహిళ ఆత్మహత్య | Woman committed suicide assaults | Sakshi
Sakshi News home page

పోకిరీల వేధింపులతో మహిళ ఆత్మహత్య

Jan 9 2015 12:18 PM | Updated on Mar 28 2018 11:05 AM

పోకిరీల వేధింపులతో మహిళ ఆత్మహత్య - Sakshi

పోకిరీల వేధింపులతో మహిళ ఆత్మహత్య

ఆకతాయిల ఆగడాలు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్:  రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో దారుణం చోటు చేసుకుంది. ఆకతాయిల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఉపాధి కోసం రాజస్థాన్ రాష్ట్రం నుంచి నగరానికి సదరు మహిళ కుటుంబం తరలి వచ్చింది. ఆ క్రమంలో ఆ కుటుంబం ఘట్కేసర్ లో స్థిరపడింది. అయితే ఆ మహిళను గత కొంతకాలంగా ఆకతాయిలు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు.

దాంతో ఆమె తీవ్ర కలత చెంది... శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement