►సామాన్యుడిపై ధరాఘాతం
► దిగిరానంటున్న పప్పులు, కూరగాయ ధరలు
► పచ్చి మిర్చి, ఉల్లి, అల్లం, వెల్లుల్లి ధరలు పైపైకి
► రూ.120-130 మధ్యే పప్పులు
► మూడురెట్లు పెరిగిన ఆకుకూరలు
►4 వేల హెక్టార్లకు గానూ
వెయ్యి హెక్టార్ల సాగుకే ఉల్లి పరిమితం
► ఇప్పటివరకు మిర్చి సాగు జాడే లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పప్పులు, కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సాగు చతికిలపడడంతో పచ్చి మిర్చి ధర నషాళాన్ని తాకుతోంది. ఉల్లి ఘాటెక్కిస్తోంది. ఇక అల్లం, వెల్లుల్లి ధరలైతే ఏకంగా పావు కిలో రూ.40కి చేరాయి. కొండెక్కిన పప్పుల ధరలు రూ.120-130తో మధ్య తచ్చాడుతున్నాయి. ఖరీఫ్ మొదలైనా ఆశించిన రీతిలో కాయగూరల సాగు జోరందుకోకపోవడం, పంటల విస్తీర్ణం ఆశాజనకంగా లేకపోవడంతో సామాన్యుడిపై ధరాఘాతం తప్పడం లేదు!
ఉల్లి ఘాటు.. మిర్చి పోటు
రాష్ట్రంలో డిమాండ్ మేరకు కూరగాయలు సరఫరా కాకపోవడంతో ధరలు భారీగా పెరుగుతూ పోతున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో టమాటా, వంకాయ, కాకరకాయ ధరలన్నీ కిలో రూ.30 వరకు ఉండగా, బెండకాయ రూ.40, బీరకాయ రూ.60, చిక్కుడు, క్యాప్సికం రూ.40 వరకు పలుకుతున్నాయి. రాష్ట్రంలో సాధారణంగా కూరగాయల సాగు 6 లక్షల ఎకరాలు. అయితే ఇప్పటివరకు 4 లక్షల్లోనే సాగయ్యాయి. ఉల్లి 10 వేల ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా.. కేవలం రెండున్నర వేల ఎకరాలకే పరిమితమైంది. మిర్చి 1.45 లక్షల ఎకరాలకుగానూ ఇప్పటివరకు ఒక్క ఎకరంలోనూ సాగు కాలేదు. దీంతో గత నెల కిలో రూ.40 పలికిన పచ్చి మిర్చి ధర అమాంతం రూ.60కి పెరిగింది. ఉల్లి ధర నెలలోనూ రూ.20నుంచి రూ.30కి పెరిగింది. పప్పుల సాగు విస్తీర్ణం ఇంకా ఆశించిన మేర పుంజుకోలేదు. ఇప్పుడిప్పుడే 2.23 లక్షల హెక్టార్లలో సాగు మొదలైన దృష్ట్యా కందిపప్పు, మినప్పప్పు, పెసర పప్పు ధరలన్నీ ఇంకా రూ.120 నుంచి రూ.130 మధ్యే కొనసాగుతున్నాయి.
ఆకుకూరల ధరలు మూడు రెట్లు
ఆకుకూరల ధరలు రెండు నుంచి మూడు రెట్ల వరకూ పెరిగాయి. రెండు నెలల కిందటి వరకూ రూ.5 ఉన్న ఆకుకూరల కట్ట ఇప్పుడు రూ. 15కు పెంచేశారు. గోంగూర కట్ట రూ.5 నుంచి రూ.10కి పెరగ్గా, తోటకూర, బచ్చలాకు, చుక్కాకు, కొత్తిమీర ధరలు మూడు రెట్లు పెరిగాయి. రూ.5 ఇవ్వందే కరివేపాకు రెమ్మ కూడా ఇవ్వడం లేదు. రూ.5 ఉన్న పాలకూర కట్ట రూ. 10కి చేరింది. వేసవి వల్ల నీళ్లు లేక దిగుబడి పడిపోయిందని, అందువల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
చికెన్ స్కిన్లెస్ రూ.190
ఎన్నడూ లేనివిధంగా చికెన్, మటన్ ధరలు అనూహ్యంగా పెరిగాయి. 15 రోజుల కిందటి వరకు స్కిన్లెస్ చికెన్ ధర రూ.120 నుంచి రూ.130 వరకు ఉండగా అది ఇప్పుడు ఏకంగా రూ.190కి పెరిగింది. ఇది గతేడాది ధరతో పోలిస్తే దాదాపు రెండు రెట్లు. మట న్ ధర కిలో రూ.480 ఉండగా రూ.550కి పెరిగింది. ఇప్పట్లో ఈ ధరలు సైతం తగ్గే అవకాశ ం లేదని వ్యాపార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్య, దిగువ మధ్యతరగతి ప్రజలు మాంసాహారం దాదాపు మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది.
నిత్యావసరం.. నిత్య సమరం!
Published Thu, Jul 2 2015 12:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement