త్వరలో 6 వేల గురుకుల టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ | The notification for the recruitment of teachers will release soon | Sakshi
Sakshi News home page

త్వరలో 6 వేల గురుకుల టీచర్ల భర్తీకి నోటిఫికేషన్

Oct 18 2016 2:32 AM | Updated on Sep 4 2017 5:30 PM

రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు

గ్రూప్-2 తర్వాత జారీకి టీఎస్‌పీఎస్సీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు, కొత్త గురుకులాల్లో మంజూరు చేసిన దాదాపు 6 వేల పోస్టుల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలో నిర్వహించనున్న గ్రూప్-2 రాత పరీక్ష తర్వాతే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు బాలికల కోసం ఏర్పాటు చేసిన గురుకులాల్లో మహిళలతోనే పోస్టులను భర్తీ చే సేలా టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement