అక్బరుద్దీన్కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్ : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2012లో నిజామాబాద్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన ప్రస్తుతం బెయిల్ పైన ఉన్న విషయం తెలిసిందే. అయితే అక్బరుద్దీన్ పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సెషన్ కోర్టులో హిందూ సంఘటన్ అధ్యక్షులు, న్యాయవాది కరుణాసాగర్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్బరుద్దీన్ ఇదే తరహాలో రెచ్చగొట్టే ప్రసంగం చేస్తున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఒవైసీ బెయిల్ పిటిషన్లోని నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఇవాళ ఎమ్మెల్యే అక్బరుద్దీన్తో పాటు సీబీసీఐడీ పోలీసులుకు నోటీసులు ఇచ్చింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి