గర్భిణి ప్రాణం తీసిన పేదరికం | Pregnant died due to treatment delay | Sakshi
Sakshi News home page

గర్భిణి ప్రాణం తీసిన పేదరికం

Oct 16 2015 6:21 PM | Updated on Sep 3 2017 11:04 AM

8 నెలల గర్భిణీ వైద్యం సకాలంలో అందక మృత్యువాతపడింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాచారెడ్డిలో జరిగింది.

మాచారెడ్డి (నిజామాబాద్) : 8 నెలల గర్భిణి వైద్యం సకాలంలో అందక మృత్యువాతపడింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాచారెడ్డిలో జరిగింది. మండలంలోని ఇస్సాయిపేటకు చెందిన శివరాజ్, లక్ష్మి(28) నిరుపేద దంపతులు. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోలేక లక్ష్మి గర్భం దాల్చిన నాటి నుంచి కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో చూపించుకుంటోంది.

ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భవతి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి అస్వస్థతకు గురైన లక్ష్మిని కుటుంబసభ్యులు కామారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించటంతో నిజామాబాద్ సర్కారు దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు హైదరాబాద్‌కు రెఫర్ చేయటంతో తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె కన్నుమూసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement