' రైతుల జీవితాలతో ఆటలాడుకుంటోంది' | ponnala lakshmaiah takes on telangana government over farmers suicides | Sakshi
Sakshi News home page

' రైతుల జీవితాలతో ఆటలాడుకుంటోంది'

Oct 14 2014 2:28 PM | Updated on Nov 6 2018 8:28 PM

' రైతుల జీవితాలతో ఆటలాడుకుంటోంది' - Sakshi

' రైతుల జీవితాలతో ఆటలాడుకుంటోంది'

టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు.

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఇప్పటివరకూ 233మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి సహాయం అందచేయలేదన్నారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వం తప్పుడు సమాచారాలతో రైతుల జీవితాలతో ఆటలాడుకుంటోందని పొన్నాల మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు.

మాఫీ చేయాల్సిన రుణాలు సుమారు 23 వేల కోట్లు ఉంటే ప్రభుత్వం 17వేల కోట్లుగా చూపుతోందని పొన్నాల అన్నారు. ప్రభుత్వం 25 శాతం రుణాలు మాఫీ చేశామంటున్నప్పటికీ రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వటం లేదన్నారు. రాష్ట్రానికి దక్కాల్సిన 50 శాతం విద్యుత్ పొందలేకపోవటానికి కేసీఆరే కారణమని పొన్నాల అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement