
ఈ పాపకు 52ఏళ్లా..!
జోగిపేట పట్టణానికి చెందిన దీక్షిత అనే పాపకు ఆసరా పథకం కింద అధికారులు వెయ్యిరూపాయలు మంజూరు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
చిన్నారికి ‘ఆసరా’ పెన్షన్ మంజూరు చేసిన జోగిపేట ఆధికారులు
జోగిపేట: జోగిపేట పట్టణానికి చెందిన దీక్షిత అనే పాపకు ఆసరా పథకం కింద అధికారులు వెయ్యిరూపాయలు మంజూరు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. పట్టణంలోని 17వ వార్డులో దీక్షిత పేరు మీద మూడవ విడత కార్యక్రమంలో పెన్షన్ మంజూరైంది. ఇంత చిన్నారికి పెన్షన్ ఎలా మంజూరైందంటూ స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. పైగా జాబితాలో పాపకు 52 ఏళ్లని, చేనేత కార్మికురాలని పేర్కొన్నారు. నగర పంచాయతీ కమిషనర్ ప్రభాకర్ దృష్టికి ఈ విషయం తీసుకువెళితే ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.