వారి నియామకంపై విచారణ వాయిదా | 'parlimentary secrataries' pil next hearing on thursday | Sakshi
Sakshi News home page

వారి నియామకంపై విచారణ వాయిదా

Apr 30 2015 2:00 AM | Updated on Aug 31 2018 8:24 PM

పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 23న జారీ చేసిన చట్టం (యాక్ట్ 7/2015)ను సవాల్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ గురువారానికి వాయిదా వేసింది.

హైదరాబాద్: పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 23న జారీ చేసిన చట్టం (యాక్ట్ 7/2015)ను సవాల్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ గురువారానికి వాయిదా వేసింది. ఇదే అంశంపై నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌ను సైతం హైకోర్టు గురువారం విచారించనున్నది. రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఆ రోజున గుత్తా దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా విచారిస్తామని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement