డెలివరీ కోసం వచ్చిన మహిళకు డాక్టర్లు వైద్యం అందించకుండా నిర్లక్ష్యం వహించడంతో బిడ్డ మృతిచెందగా, తల్లి పరిస్థితి విషమంగా మారింది.
డాక్టర్ల నిర్లక్ష్యం..బిడ్డ మృతి
Feb 15 2016 8:41 PM | Updated on Apr 3 2019 8:07 PM
హైదరాబాద్: డెలివరీ కోసం వచ్చిన మహిళకు డాక్టర్లు వైద్యం అందించకుండా నిర్లక్ష్యం వహించడంతో బిడ్డ మృతిచెందగా, తల్లి పరిస్థితి విషమంగా మారింది. నగరంలోని ఓప్రైవేటు ఆసుపత్రిలో రజిత అనే మహిళ డెలివరీ కోసం సోమవారం వచ్చింది. అయితే వైద్యులు నిర్లక్ష్యం వహించటం వల్ల బిడ్డ మరణించిందని ,తల్లి పరిస్థితి విషమంగా మారిందని ఇందుకు డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని రజిత బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement