ఎమ్మార్పీఎస్ ధర్నా | MRPS dharna in nalgonda district | Sakshi
Sakshi News home page

ఎమ్మార్పీఎస్ ధర్నా

Jan 8 2016 11:32 AM | Updated on Sep 3 2017 3:19 PM

రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబెద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి యత్నించిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. ఎమ్మార్పీఎస్ నాయకులు రహదారిపై బైఠాయించారు.

కోదాడ: రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబెద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి యత్నించిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. ఎమ్మార్పీఎస్ నాయకులు రహదారిపై బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చర్యలు తీసుకుంటాం అని హామీ ఇవ్వడంతో.. ఆందోళన విరమించారు. నల్లగొండ జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు అంబెద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి యత్నించారు. ఇది గుర్తించిన స్థానికులు ఆందోళనకు దిగారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement