చంద్రబాబుని రాజకీయంగా బొందపెట్టాలి

Motkupalli Narasimhulu Tomorrow Visits Tirupati - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు నేడు తిరుపతి వెళ్లనున్నారు. ఈరోజు (మంగళవారం) తిరుపతికి చేరుకుని, రేపు ఉదయం తొమ్మిది గంటలకు అలిపిరి నుంచి కొండపైకి కాలి నడకన వెళ్లి దేవుడుని దర్శించుకుంటానని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు వ్యతిరేక శక్తులన్ని ఏకమై ఆ దుర్మార్గుడిని రాజకీయంగా బొందపెట్టాలని ఆ దేవుడిని వేడుకుంటానని వ్యాఖ్యానించారు. దళితులు, బలహీనవర్గాలు చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. దిక్కులేని వాడికి దేవుడే దిక్కని తన 64వ జన్మదినం రోజున తన మానసిక క్షోభను దేవుడికి చెప్పుకునేందుకే తిరుమల వెళ్తున్నాని తెలిపారు. రేపు ఉదయం​ అలిపిరి వద్ద మీడియాతో మాట్లాడి పాదయాత్రగా కొండపైకి చేరుకుంటానని అన్నారు. 12వ తేది మధ్యాహ్నం ఒంటిగంటకు తిరుపతిలో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి మాట్లాడుతానని ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top