జాతరలో ఎమ్మెల్యేకు అవమానం.. | MLA Babu Mohan faces inconvenience in medaram jatara | Sakshi
Sakshi News home page

జాతరలో ఎమ్మెల్యేకు అవమానం..

Feb 19 2016 8:17 PM | Updated on Sep 3 2017 5:58 PM

ప్రముఖ హాస్యనటుడు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్‌కు మేడారం జాతరలో పోలీసుల నుంచి అవమానం ఎదురైంది.

మేడారం (వరంగల్) : ప్రముఖ హాస్యనటుడు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్‌కు మేడారం జాతరలో పోలీసుల నుంచి అవమానం ఎదురైంది. బాబూమోహన్‌ శుక్రవారం సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం వెళ్లగా వీఐపీలు దర్శనానికి వెళ్లే ద్వారం గేటుకు డీఎస్పీ తాళం వేసి వెళ్లిపోయారు.

ఈ సందర్భంగా బాబూ మోహన్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులే గేటు తాళం పగులగొట్టి ఎమ్మెల్యేకు దర్శనం కల్పించారు. బాబూమోహన్ మాట్లాడుతూ.. జాతరలో పోలీసుల తీరు అభ్యంతరకరంగా ఉందని అన్నారు. ఘటనపై సీఎంకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement