దండకారణ్యంలో
మూడు రోజుల పాటు సభలు
క్రీడా సామగ్రి పంపిణీ..
పోటీల నిర్వహణ
దుమ్ముగూడెం: తెలంగాణలోని ఖమ్మం జిల్లా సరిహద్దు ఛత్తీస్గఢ్ జిల్లా సుకుమా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో బూరుగులంక అటవీ ప్రాంతంలో శుక్రవారం ఆదివాసీలతో మావోయిస్టుల అగ్ర నేతలు భారీ బహిరంగ సభ నిర్వహించినట్లు సమాచారం. అంతటితో ఆగకుండా బహిరంగ సభలు నిర్వహించిన స్థలం నుంచి 100 మీటర్ల దూరంలోని బూగురులంక సంతలో మావోయిస్టు అగ్రనేత సావిత్రి (రామన్న భార్య)సహా 200 మంది మావోయిస్టులు తుపాకులతో హల్చల్ చేసినట్లు తెలిసింది. ఈ బహిరంగ సభలను మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రామన్న నేతృత్వంలో సంతోష్, సావిత్రి, లచ్చన్న, ఉదమ్సింగ్, భగ త్, నగేష్, సోనిల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఆయా ప్రాంతాల ఆదివాసీలను తమ ఆధీనంలో ఉంచుకునేందుకు బుధవారం నుంచి బూరుగులంక అటవీప్రాంతంలో ఈ బహిరంగ సభలను నిర్వహించినట్లు తెలుస్తోంది. సభలకు దండకారణ్యానికి చెందిన ఆదివాసీలు పెద్ద ఎత్తున హాజరైనట్లు తెలుస్తోంది. సభల్లో మావోయిస్టు నేతలు మాట్లాడుతూ పోలీసులు దండకారణ్యంలో నిర్మించతలపెట్టిన బేస్క్యాంపు నిర్మాణాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చినట్లు సమాచారం. ప్రశాంత వాతావరణంలో బతుకుతున్న తమ గ్రామాలను నాశనం చేయవద్దని.. బేస్ క్యాంపు నిర్మాణానికి వచ్చిన పోలీసులను అడ్డుకోవాలని ఆదివాసీలకు సూచించినట్లు సమాచారం. అటవీ ప్రాంతంలో అదేవిధంగా నిర్మాణాలు చేపడితే ఎదురుతిరిగి అడ్డుకోవాలని ఆదివాసీలకు ధైర్యం నూరిపోసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
క్రీడా సామగ్రి పంపిణీ..
మావోయిస్టులు సరిహద్దు ఆదివాసీలను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఆదివాసీ యువకులకు క్రీడా కిట్లు పంపిణీ చేయడంతో పాటు.. క్రీడా పోటీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులనూ పంపిణీ చేసినట్లు సమాచారం.
మావోయిస్టుల భారీ సభ
Published Sat, May 16 2015 4:07 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement