రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | man died in a road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Mar 20 2015 4:04 PM | Updated on Aug 30 2018 3:56 PM

బైక్ ను ఆటో ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు

మంచిర్యాల : బైక్ ను ఆటో ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పొన్నారం గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్(19)  బైక్‌పై వెళుతుండగా అదే మండలానికి చెందిన గుడిపేట గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు.

కాగా ఈ ఘటనలో దివ్య అనే యువతి తీవ్రంగా గాయపడింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దివ్యను ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement