టీపీసీసీ వర్కింగ్ {పెసిడెంట్ భట్టి
నిజామాబాద్లో కాంగ్రెస్ పాదయాత్ర
నిజామాబాద్: సీఎం కేసీఆర్ అవినీతికి నిదర్శనమే వరంగల్ ఉప ఎన్నిక అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చాయంటూ రాజయ్యను భర్తరఫ్ చేసి.. శ్రీహరికి ఆ స్థానం కట్టబెట్టడం వల్లే ఎన్నికలు వచ్చాయన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ వద్దంటూ నిజామాబాద్ మండలం మోపాల్ నుంచి మంచిప్ప వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సుమారు 10 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మంచిప్పలో బహిరంగసభలో భట్టి మాట్లాడారు. ‘‘అవినీతికి పాల్పడుతున్నారంటూ రాజ య్యను బర్తరఫ్ చేశావు.. మరి నీవు అవినీతికి పాల్పడుతున్నావు నిన్ను ఎవరు బర్తరఫ్ చేయాలి’’ అంటూ కేసీఆర్ను ఉద్దేశించి ప్రశ్నించారు.
రైతులకు సాగు నీటి ఇబ్బందులు లేకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరిచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడానికే పాదయాత్రలు చేస్తున్నామన్నారు. పెద్దమొత్తంలో కమీషన్ల కోసం మొదలెట్టిన రూ.36 వేల కోట్ల వాటర్గ్రిడ్ ప్రాజెక్టు కోసం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చంపేయాలని చూస్తున్నారని విక్రమార్క ఆరోపిం చారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై విడుదల చేసిన జీవో నంబర్ 28 ప్రకారం వేసిన కమిటీ నివేదికను బట్టబయలు చేయాలని మాజీ స్పీకర్ కేఆర్ సురేష్రెడ్డి డిమాం డ్ చేశారు. సమావేశంలో శాసనమండలి కాం గ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ, మాజీమం త్రి పి. సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, తాహెర్బిన్ హందాన్, యాష్కీ మధుగౌడ్ పాల్గొన్నారు.
కేసీఆర్ అవినీతికి నిదర్శనమే వరంగల్ ఉప ఎన్నిక
Published Wed, Nov 4 2015 1:43 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
Pune Porsche Crash: మైనర్ తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు
దేశంలో నంబర్వన్ ఐఎస్బీ
మొగదారమ్మ ఉత్సవాలు ప్రారంభం
బోధనా నైపుణ్యాలు పెంచుకోవాలి
శాంతి చర్చల ద్వారా సమస్యల పరిష్కారం
ఇసుక అక్రమ తవ్వకాలపై కొరడా
బాలికల ఆశ్రమ పాఠశాలలో చేరికకు దరఖాస్తుల ఆహ్వానం
కౌన్సిలర్ ద్విచక్రవాహనం దహనం చేసిన దుండగులు
మాచర్లలో కొనసాగుతున్న 144 సెక్షన్
పోలీసు అధికారుల నియామకం
తప్పక చదవండి
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement