మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు: సీఎం కేసీఆర్‌ | KCR Announced 5Lakhs Compensation Devipatnam Boat Capsize Victims | Sakshi
Sakshi News home page

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు: సీఎం కేసీఆర్‌

Sep 16 2019 3:52 AM | Updated on Sep 16 2019 3:52 AM

KCR Announced 5Lakhs Compensation Devipatnam Boat Capsize Victims - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో పాపికొండల వద్ద జరిగిన లాంచీ ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల్లో తెలంగాణవాసులు ఉండటంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.  

పడవ ప్రమాదంపై గవర్నర్‌ విచారం 
సాక్షి, హైదరాబాద్‌: గోదావరి నదిలో పడవ ప్రమాదంపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

సాగర్‌–శ్రీశైలం బోటు టూరు రద్దు 
సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదిలో నాగార్జున సాగర్‌–శ్రీశైలం మధ్య నిర్వహించే బోటు టూర్‌ ను తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రస్తుతం కృష్ణానదిలో నీటి ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో నీటి ప్రవాహ వేగం పెరగటంతో శని,ఆదివారాల్లో నిర్వహించే బోటు టూర్‌ను రద్దు చేసుకుంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement