6న హైకోర్టును సందర్శించనున్న సీజేఐ | H L dattu to be visited joint of state high court on December 6 | Sakshi
Sakshi News home page

6న హైకోర్టును సందర్శించనున్న సీజేఐ

Nov 30 2014 6:52 AM | Updated on Sep 2 2017 5:24 PM

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) హెచ్.ఎల్.దత్తు డిసెంబర్ 6న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టును సందర్శించనున్నారు.

విభజనపై న్యాయమూర్తులతో చర్చ..?
 సాక్షి, హైదరాబాద్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) హెచ్.ఎల్.దత్తు డిసెంబర్ 6న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టును సందర్శించనున్నారు. ఇందులో భాగంగా ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా మిగిలిన న్యాయమూర్తులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. హైకోర్టు విభజనపై కూడా ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఢిల్లీ నుంచి ప్రధాన న్యాయమూర్తి డిసెంబర్ 5న రాత్రి 7.15 గంటలకు భార్యా సమేతంగా హైదరాబాద్ చేరుకుంటారు. 6వ తేదీ ఉదయం హైకోర్టును సందర్శిస్తారు. అదే రోజు సాయంత్రం తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement