రాష్ట్రంలో జరుగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలులో ఇంటర్ పరీక్షల కారణంగా మార్పులు చోటుచేసుకున్నాయి.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలులో ఇంటర్ పరీక్షల కారణంగా మార్పులు చోటుచేసుకున్నాయి. ‘వరంగల్, ఖమ్మం, నల్లగొండ’, ‘హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్’ నియోజకవర్గాల్లో మార్చి 16న జరగాల్సిన పోలింగ్ను 22వ తేదీకి మార్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు. 22న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 25న ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తారు.