- రేపటి నుంచి 25వరకు విలేజ్ క్యాంపెరుున్
- 25న జిలా ్లకేంద్రంలో ర్యాలీ
- విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షురాలు ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే
కేయూ క్యాంపస్ : ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతపై గ్రామాల్లో, బస్తీల్లో చైతన్య కార్యక్రమాలను నిర్వహించబోతున్నామని విద్యాపరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షురాలు, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ కె.కాత్యాయనీ విద్మహే తెలిపారు. కాకతీయ యూనివర్సిటీలోని గెస్ట్హౌస్లో విద్యాపరిక్షణ కమిటీ బాధ్యులు, వివిధ విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాల బాధ్యులు ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అన్నిరకాల వసతులు, సౌకర్యాలు కల్పించి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రేషనలైజేషన్ పేరుతో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే నెపంతో నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ పాఠశాలల ను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ప్రజలను చైతన్యపరిచేందుకు ‘గ్రామాలకు తరలండి, బస్తీలకు తరలండి’ అనే కార్యక్రమాలను విద్యాపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి నిర్వహించబోతున్నట్లు తెలి పారు. స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి తమ గ్రామాల్లోని పాఠశాలలను పరిక్షించుకోవాల్సిన బాధ్యతపై చైతన్యం కలిగిస్తామన్నారు. 12న తొలుత ఆదర్శ గ్రామం గంగదేవునిపల్లి నుంచి ఈ కార్యాక్రమం ప్రారంభిస్తామన్నారు.
ఈ నెల 25న జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.గంగాధర్, విద్యాపరిరక్షణ కమిటీ జిల్లా సహాధ్యక్షుడు ఎం. రవీందర్, విద్యా పరిక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ టి.లింగారెడ్డి, కోకన్వీనర్ కడారి భోగేశ్వర్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర బాధ్యులు అభినవ్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యద ర్శులు పైండ్ల యాకయ్య, బి.నరసింహారావు, డీఎస్యూ జిల్లా కార్యదర్శి జనార్దన్, టీవీవీ జిల్లా బాధ్యులు బి.బాలరాజు, పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి దుర్గం సారయ్య, కేయూ అధ్యక్షుడు సూత్రపు అనిల్ మాట్లాడారు. ఆయా విద్యార్థి సంఘాల బాధ్యులు మాట్లాడుతూ విద్యాపరిక్షణ కమిటీ ఈ నెల 12నుంచి చేపట్టబోతున్న గ్రామాలకు తరలండి చైతన్య కార్యక్రమంలో తామంతా కూడా భాగస్వాములు అవుతామని వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకుందాం
Published Mon, May 11 2015 2:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement