
11గంటలకు సిద్ధయ్య అంతిమ యాత్ర
సిద్ధయ్య (29) అంతిమ యాత్ర బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది
మహబూబ్ నగర్: ఉగ్రవాదుల తూటాలను ఎదుర్కొని మృత్యువుతో పోరాడుతూ అమరుడయిన నల్లగొండ జిల్లా ఆత్మకూర్ (మం) ఎస్ఐ జూలూరి సిద్ధయ్య (29) అంతిమ యాత్ర బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.
మధ్యాహ్నం ఒంటిగంటకు జడ్చర్ల దర్గాలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం 3 గంటలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి.