ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని పాదాచరులను ఇబ్బందిపెడుతున్నవారి ఆటకట్టించడానికి ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగారు.
ఆదిలాబాద్: ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని పాదాచరులను ఇబ్బందిపెడుతున్నవారి ఆటకట్టించడానికి ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి పరిధిలో రోడ్లపై అక్రమంగా ఏర్పాటు చేసుకున్న దుకాణాలను సోమవారం ఉదయం తొలగించారు. మున్సిపల్ కమీషనర్ నాగేశ్వర్రావు, తహశీల్దార్ సుభాష్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం నుంచి అక్రమ కట్టడాలను కూల్చివేసే కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటివరకు ఎనిమిది దుకాణాలను తొలగించారు.