రేపటి నుంచి దసరా సెలవులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు పాఠశాల విద్యా శాఖ, ఇంటర్ బోర్డులు దసరా సెలవులు ప్రకటించాయి. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 4 వరకు సెలవులని పాఠశాల విద్యాశాఖ పేర్కొనగా, జూనియర్ కాలేజీలకు 20 నుంచి 2 వరకు సెలవులని ఇంటర్మీడియెట్ బోర్డు తెలిపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని స్కూళ్లు, కాలేజీలకు ఈ సెలవులు వర్తిస్తాయని ఆయా శాఖల అధికారులు వెల్లడించారు. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 3న, పాఠశాలలకు 5న తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. సెలవుల్లో తరగతులు నిర్వహించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.