'వారిద్దరిపై సీబీఐతో విచారణ చేయించాలి' | congress mla jeevan reddy letter to Pranab Mukherjee On chandrababu, kcr issue | Sakshi
Sakshi News home page

'వారిద్దరిపై సీబీఐతో విచారణ చేయించాలి'

Jun 10 2015 2:50 PM | Updated on Aug 15 2018 9:27 PM

'వారిద్దరిపై సీబీఐతో విచారణ చేయించాలి' - Sakshi

'వారిద్దరిపై సీబీఐతో విచారణ చేయించాలి'

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్, చంద్రబాబులు అవినీతి రాజకీయాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ..

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్, చంద్రబాబులు అవినీతి రాజకీయాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. చంద్రబాబు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి దొరికిపోయారని, కేసీఆర్ 12మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీఆర్ఎస్లో చేర్చుకున్నారని జీవన్ రెడ్డి తన  లేఖలో పేర్కొన్నారు. ఇద్దరు సీఎంలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నారని, ఇద్దరి రాజకీయ అవినీతి బయటపడాలంటే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement