సత్తుపల్లి మండలంలో బీజేపీ నాయకుల ప్రచారం

BJP Election Campaign In Sattupalli - Sakshi

సాక్షి,సత్తుపల్లిటౌన్‌: బీజేపీ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరరావును గెలిపించాలని కోరుతూ శుక్రవారం పట్టణంలోని వెంగళరావునగర్‌లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు భూక్యా శ్యాంసుందర్‌నాయక్, కె.రాజా, శివ, రహీం, ఆనంద్, పుల్లారావు, సుధాకర్, గణేష్, గోపి పాల్గొన్నారు. 
సత్తుపల్లి మండలంలో..  
సత్తుపల్లిరూరల్‌: మండల పరిధిలోని కిష్టాపురం, తుంబూరు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరరావును గెలిపించాలని కోరుతూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూసంపూడి రవీంద్ర ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా సొంత ఇంటి స్థలంలో ఒక్క ఇళ్లు నిర్మించిన దాఖలాలు లేవన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు, పాలకొల్లు శ్రీను పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top