తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా

All Entrance Tests Postponed In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా కారణంగా తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధిస్తే.. పరీక్షలు ఎలా నిర్వహిస్తారనే దానిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లాక్‌డౌన్‌ స్పష్టత ఇచ్చాకే పిటిషన్‌పై విచారణ జరపాల్సి  ఉంటుందని తెలిపింది. అయితే లాక్‌డౌన్‌ నిర్ణయంపై ఆధారపడి ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రభత్వుం కోర్టుకు నివేదించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో జరగాల్సిన ఎంసెట్‌, పాలిసెట్‌, ఐసెట్‌ సహా అన్ని  ప్రవేశ పరీక్షలు వాయిదా పడినట్టయింది.(చదవండి : తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుకు కరోనా)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top