ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ గుండెపోటుతో మృతి
సాక్షి, హైదరాబాద్ : అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ప్రతాప్ గుండెపోటుతో మృతి చెందారు. కొంపల్లిలోని తన నివాసంలో ఇవాళ తెల్లవారుజామున ఆయన మరణించారు. కాగా వారం రోజుల క్రితం ప్రతాప్ సస్పెన్షన్కు గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.