రాష్ట్రంలో కొత్తగా 23 అగ్నిమాపక కేంద్రాలు | 23 new fire stations in the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో కొత్తగా 23 అగ్నిమాపక కేంద్రాలు

Nov 23 2014 5:44 AM | Updated on Sep 2 2017 4:59 PM

రాష్ట్రంలో కొత్తగా 23 అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులు ప్రతిపాదించారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 23 అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులు ప్రతిపాదించారు. రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట్‌లోని జునవెల్లి వ్యాలీ వద్ద ఒకటి, చర్లపల్లి పారిశ్రామిక వాడలో మరొక కొత్త ఫైర్ స్టేషన్‌ను ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కొక్క ఫైర్ స్టేషన్‌కు దాదాపు రూ.2కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. అలాగే అగ్నిమాపక కేంద్రాల్లో  సిబ్బంది  కొరతను  పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement