ఆర్టీసీ బస్సు- లారీ ఢీ: 15 మందికి తీవ్ర గాయాలు | 15 injured in Road Accident in Adilabad district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు- లారీ ఢీ: 15 మందికి తీవ్ర గాయాలు

Aug 5 2014 10:11 AM | Updated on Aug 30 2018 3:58 PM

ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం ఇప్పల్ నవగామ్ వద్ద ఆర్టీసీ బస్సు , లారీని ఢీ కొట్టింది.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం ఇప్పల్ నవగామ్ వద్ద ఆర్టీసీ బస్సు , లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా  గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. గాయపడిన వారిలో విద్యార్థులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది పాఠశాల విద్యార్థులతో సహా 80 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులు బస్సులో ఎక్కడంతోపాటు డ్రైవర్ అతి వేగం ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement