బెంగళూరు (బనశంకరి): రైలు పట్టాలపై జీపు నిలిపి సెల్ఫీ దిగుతుండగా... మంగళ ఎక్స్ప్రెస్ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదం నుంచి దంపతులతో సహా నలుగురు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని రామనగర సమీపంలో బసవనపుర వద్ద శనివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు నగరంలోని కొత్తనూరుకు చెందిన ప్రదీప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. శుక్రవారం ఉగాది పండుగ జరుపుకున్న అనంతరం భార్య ప్రతిభ, మరో ఇద్దరితో కలిసి జీపులో మైసూరుకు విహార యాత్రకు వెళ్లారు. శనివారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. రామనగర జిల్లా బసవనపుర, వడేరహళ్లి మధ్య అన్మ్యాన్డ్ క్రాసింగ్లో రైలు పట్టాలపై జీపు నిలిపారు.
అనంతరం దంపతులు ట్రాక్పై నిలబడి మొబైల్లో సెల్ఫీ తీసుకుంటుండగా మైసూరు నుంచి బెంగళూరుకు వెళ్లే మంగళ ఎక్స్ప్రెస్ రైలు దూసుకొచ్చింది. గమనించిన దంపతులు ఒక్కసారిగా పక్కకు తప్పుకున్నారు. రైలు వేగంగా జీపును ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటనలో జీపు పూర్తిగా ధ్వంసమైంది. రామనగర సీఐ కుమార్, చెన్నపట్టణ రైల్వే పోలీస్ స్టేషన్ సీఐ జేబీ మోకాశి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పట్టాలపై ఉన్న జీపును తొలగించారు. దీంతో గంట ఆలస్యంగా మంగళ ఎక్స్ప్రెస్ బెంగళూరుకు బయలుదేరింది.
రైలు పట్టాలపై జీపు నిలిపి సెల్ఫీ.. అంతలో
Published Sat, Apr 9 2016 8:06 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రెండు బైక్లు ఢీ.. ఇద్దరికి గాయాలు
వరుస చోరీలతో భయాందోళన
ఎన్నికల విధుల సమస్యల పరిష్కారంపై హామీ
గంజాయితో ముగ్గురు యువకుల అరెస్ట్
సుభలయలో కార్డన్సెర్చ్
● జూన్ 4 కోసం అందరి ఎదురుచూపులు ● కాళింగ కార్పొరేషన్ చైర్మన్ దుంపల లక్ష్మణరావు
వైభవంగా అశ్వవాహన సేవ
‘ప్రతి బోటుకు జీపీఎస్ తప్పనిసరి’
కౌంటింగ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి
మనదేపెత్తనం
తప్పక చదవండి
- రాష్ట్రీయ గీతం.. రెండు వెర్షన్లలో
- వారణాసిలో వార్ వన్ సైడే
- ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
- సన్న వడ్లపై సర్కార్ సన్నాయి నొక్కులు
- ‘పట్టభద్రులపై’ పట్టు కోసం!
- ఆక్వాలో అగ్రగామిగా ఏపీ
- మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
- ఇక సులభంగా సేంద్రీయ ధ్రువీకరణ
- సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
Advertisement