వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో శ్రీ కాళహస్తి పుణ్యక్షేత్రానికి విచ్చేశారు.
ముక్కంటి సేవలో కోరుముట్ల
May 22 2017 4:35 PM | Updated on May 29 2018 4:37 PM
శ్రీకాళహస్తి: శ్రీ కాళహస్తి పుణ్యక్షేత్రానికి కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో సోమవారం విచ్చేశారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా ఆలయం సమీపంలో పార్టీ స్థానిక సమన్వయకర్త బియ్యపు మధుసూదన్రెడ్డి సారథ్యంలో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ప్రత్యేక టిక్కెట్ ద్వారా రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. గురుదక్షిణామూర్తి వద్ద వేదపండితుల ఆశీర్వాదం పొందారు. వారికి ఆలయాధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. వారితో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement