అతను పచ్చ కామెర్లతో బాధ పడుతున్నాడు. విశ్రాంతి కోసం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వచ్చాడు. జబ్బు కాస్త నయం అయింది.
= కుటుంబ సభ్యులు వారించినా.. వినకుండా...
= మహబూబ్నగర్ ప్రమాదంలో చిక్కుకున్న గోల్ఫ్ కోచ్
= కాలిన గాయాలతో హైదరాబాద్లో ఆస్పత్రిలో చికిత్స
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అతను పచ్చ కామెర్లతో బాధ పడుతున్నాడు. విశ్రాంతి కోసం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వచ్చాడు. జబ్బు కాస్త నయం అయింది. మళ్లీ హైదరాబాద్కు పయనం కాగా కుటుంబ సభ్యులు వారించారు. ‘మరింత విశ్రాంతి అవసరం. దీపావళి పండుగ అయ్యాక వెళ్దువు గానీ’ అని నచ్చజెప్పజూశారు. అతను వినలేదు. ఘోర ప్రమాదానికి గురైన జబ్బార్ ట్రావెల్స్ బస్సులో ఆ రోజు ప్రయాణిస్తున్నాడు. బస్సు నుంచి బయటకు దూకేశాడు కానీ, అప్పటికే 45 శాతం దాకా ఒళ్లు కాలిపోయింది.
నగరానికి చెందిన యోగేష్ గౌడ ప్రస్తుతం హైదరాబాద్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. అతని అన్న తిమ్మేగౌడ తెలిపిన సమాచారం మేర కు... హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో యోగేశ్ ఇన్స్ట్రక్టర్గా ప ని చేస్తున్నాడు. నెలలో మూడు రోజులు బెంగళూరుకు వ చ్చి వెళ్లే వాడు. అతని కళ్లు పచ్చబడుతుండడాన్ని హైదరాబాద్లో గోల్ఫ్ ఆడే ఓ డాక్టరు గమనించి చికిత్స తీసుకోవాల్సిందిగా సూచించాడు. దీంతో అతను వారం కిందట బెంగళూరుకు వచ్చేశాడు. తల్లి భాగ్యమ్మ అతని ఆలనా పాలనా చూసుకునేది.
బోర్ కొడుతుండడంతో హైదరాబాద్కు వెళ్లి పోవాలనుకున్నాడు. కుటుంబ సభ్యులు వద్దని చెబుతున్నా, హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుం టానంటూ వారికి నచ్చజెప్పి వెళ్లాడు. బస్సు వెనుక సీటు లో యోగేష్ కూర్చున్నాడు. బస్సును అగ్ని కీలలు ఆవరిస్తున్న తరుణంలో ఒక్క ఉదుటున డోర్ వద్దకు వెళ్లాడు. మధ్యలో ఓ మహిళ భయంతో అతని చేయి పట్టుకున్నా, విదిలించుకుని కిందకు దూకేశాడు. అప్పటికే అతని శరీ రంలో చాలా భాగం కాలిపోయింది.
అక్కడి డీఆర్డీఓ అ పోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. పొగ కారణంగా శ్వాస కోశం బాగా దెబ్బ తింది. ప్రస్తుతం కృత్రిమ శ్వాసపై ఉ న్నాడు. ‘కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, మా లో ధైర్యం సడలిపోకుండా చూస్తూ వచ్చిన తమ్ముడు ఇ ప్పుడు చావు బతుకుల మధ్య గడుపుతున్నాడు’ అని తి మ్మే గౌడ భోరుమన్నాడు. కాగా కొన్నేళ్లుగా యోగేష్గౌడ కుటుంబంతో విధి వింత నాటకం ఆడుతోంది. రెండేళ్ల కిందట తండ్రి మరణించాడు. ఆ దుఃఖం నుంచి కోలుకునే లోపే పెద్ద అక్క భర్త కేన్సర్తో కన్ను మూశాడు.