గనుల కుంభకోణంలోఐఏఎస్‌ అధికారి అరెస్టు | ias officer arrested in land mining case | Sakshi
Sakshi News home page

గనుల కుంభకోణంలోఐఏఎస్‌ అధికారి అరెస్టు

May 16 2017 9:01 AM | Updated on Sep 5 2017 11:18 AM

గనుల కుంభకోణంలోఐఏఎస్‌ అధికారి అరెస్టు

గనుల కుంభకోణంలోఐఏఎస్‌ అధికారి అరెస్టు

అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించి కర్ణాటక రెవెన్యూ శాఖ కార్యదర్శి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గంగారామ్‌ బడేరియా అరెస్టు అయ్యారు.

బెంగళూరు:  అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించి కర్ణాటక రెవెన్యూ శాఖ కార్యదర్శి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గంగారామ్‌ బడేరియా అరెస్టు అయ్యారు. విచారణ కోసం ఆయన్ను సోమవారం పిలిపించిన కర్ణాటక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) సాయంత్రానికి అరెస్టు చేసినట్లు ప్రకటించింది. కాగా, ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, ధరంసింగ్‌లు నిందితులుగా ఉన్నారు. బళ్లారి జిల్లాలో 11,797 చదరపు కిలోమీరట్ల మేర అటవీ భూమిని నిబంధనలకు విరుద్ధంగా డీ నోటిఫై చేయడమే కాకుండా అక్కడ గనుల తవ్వకాలకు, ఎగుమతులకు అనుమతిచ్చారన్నది ప్రధాన ఆరోపణ.

ఈ విషయమై లోకాయుక్త జస్టిస్‌ సంతోష్‌హెగ్డే గతంలోనే ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఇందులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులైన వి.ఉమేష్, గంగారామ్‌ బడేరియా, ఎం.రామప్ప, జీజా హరిసింగ్‌ వంటి 11 మంది అధికారులు విధులను దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. ఈ డీ నోటిఫైలో సీఎంలుగా పనిచేసిన కుమారస్వామి, ధరంసింగ్, ఎస్‌.ఎం కృష్ణల హస్తం కూడా ఉన్నట్లు హెగ్డే నివేదికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అబ్రహం జోసెఫ్‌ అనే సామాజిక కార్యకర్త గనుల అక్రమాలపై దర్యాప్తు జరపాలని గతంలో సుప్రీం కోర్టుకు వెళ్లారు.

పరిశీలించిన కోర్టు డీ నోటిఫైతో పాటు గనులపై మూడునెలల్లోపు విచారణ పూర్తి చేయాలని మార్చి 29న సిట్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమవారం తాజా అరెస్టు చోటుచేసుకుంది. అప్పట్లో మైసూరు మినరల్స్‌ డైరెక్టర్‌గా ఉన్న గంగారామ్‌ 14,200 మెట్రిక్‌ టన్నుల ఇనుప ఖనిజం ఎగుమతికి అక్రమంగా అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement