తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపావళి ఆస్థానంను ఘనంగా నిర్వహించారు.
ఘనంగా శ్రీవారి దీపావళి ఆస్థానం
Oct 30 2016 12:17 PM | Updated on Sep 4 2017 6:46 PM
హైదరాబాద్ : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపావళి ఆస్థానంను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది దీపావళి (అమావాస్య) రోజున ఆలయంలో సుప్రభాతం నుంచి మొదటి గంట నివేదన చేశారు. అనంతరం బంగారు వాకిలి ముందు ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పను సర్వభూపాల వాహనంపై, మరో వాహనంపై విష్వక్సేనుడిని వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు, హారతి, ప్రసాద నివేదనలు చేశారు. ఆస్థానంను పురస్కరించుకుని పలు అర్జిత సేవలు రద్దు చేశారు.
Advertisement
Advertisement